Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brs Ministers Srinivas Goud And Errabelli Dayakar Rao Comments On Central Government

BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

Published Date :April 18, 2023 , 5:50 pm
By Mahesh Jakki
BRS Ministers: రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ ఉత్సవాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

BRS Ministers: హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చెప్పారు. గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశమని.. రామాయణం రాసిన వాల్మీకిది వరంగల్ ప్రాంతమేనని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. వాల్మీకికి గొప్ప గుర్తింపు తీసుకు వచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే దేవాలయాల అభివృద్ధి చేస్తోందన్నారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశం ఇది బమ్మెర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

రామప్పకు యునెస్కోకు గుర్తింపు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. కేంద్రం ఇప్పటికైనా గుర్తించి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. 22 అడుగుల వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బమ్మెర పోతన స్వగ్రామం బమ్మెరలో కళ్యాణ మండపం, హరిత హోటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురాతన ఆలయాలను చారిత్రాత్మకమైన ప్రదేశాలను వందల కోట్లు సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో వెయ్యి గ్రామాలకు అవార్డులు రాబోతున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

Read Also: Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి

వరంగల్ అంటేనే కళలకు పుట్టిన ఇల్లు అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. ఇక్కడ అనేకమైన యునెస్కో అవార్డులు వచ్చే కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గుర్తింపు లేకుండా పోయిందని.. అప్పుడే గుర్తింపు ఇచ్చి ఉంటే ఇంకా పర్యాటక శాఖ అభివృద్ధి జరిగేదన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృషితో అవార్డులు వస్తున్నాయన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం రామప్పలో జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. మన కళలను, కవులను ఎవరు గుర్తించలేదని.. ఎన్నడైనా మన రాష్ట్రానికి ఇన్ని అవార్డులు వచ్చాయా అంటూ మంత్రి ప్రశ్నించారు. కేంద్రం సహకరించక పోయినా కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. కేంద్రం అడ్డుకోవాలని చూసినా అనేక అవార్డులు వచ్చాయని ఆయన ఆరోపించారు. అడ్డుకోకుంటే ఇంకా అనేక అవార్డులు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని.. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో ప్రతి నెలలో ఒక్కో సాంస్కృతిక కార్యక్రమం, క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ప్రతి నెల ఒక ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. 33 జిల్లాల్లో సమ్మర్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 17000 గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే క్రీడా కీట్లు కూడ అందిస్తామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హామీ ఇచ్చారు.

Read Also: Ys Viveka Case Live: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్

రామప్ప అభివృద్ధికి కేంద్రం 500 కోట్లు ఇవ్వచ్చు కానీ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చాము అని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి సహకరించడం లేదని మంత్రి ఆరోపించారు. వరంగల్ మీద ఉన్న అభిమానంతోనే వారసత్వ ఉత్సవాలను వరంగల్‌లో సీఎం కేసీఆర్ ఘనంగా చేస్తున్నారని.. ప్రత్యేక నిధులు ఇచ్చి ఈ వేడుకను ప్రభుత్వం గొప్పగా చేస్తోందన్నారు. గతంలో ఈ వేడుకలు కేవలం మొక్కుబడి కార్యక్రమంగా సాగేదని కానీ ఇప్పుడు మారిందన్నారు. వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భవిష్యత్‌లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రత్యేక ప్రణాళికతో ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Ministers
  • errabelli dayakar rao
  • Minister Srinivas Goud
  • Ramappa Temple
  • unesco

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions