Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
- సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ
- న్యాయసభలో కీలక వాదనలు, కోర్టు కీలక వ్యాఖ్యలు
- స్పీకర్ నిర్ణయంపై కోర్టు సందేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court : ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్ల ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు వినిపించగా, అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు.
కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందేనని ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. స్పీకర్కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని ఆయన వాదించారు. అయితే, ధర్మాసనం స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్ను కూడా కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని మర్చిపోవద్దని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వాదనలు ముగియగా, కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాదులు స్పీకర్ నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. అయితే, కోర్టులు స్పీకర్ను ఆదేశించలేవని, కేవలం సూచన మాత్రమే చేయగలవని ప్రతివాదుల తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
దీంతో… అనర్హత పిటిషన్లపై నాలుగేళ్ల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? అని న్యాయమూర్తి జస్టిస్ గవాయి ప్రశ్నించారు. తమ నిర్ణయాన్ని స్పీకర్కు తెలియజేస్తామని, ఆర్టికల్ 142 ప్రకారం కోర్టుల శక్తి పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాతే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారనే అంశాన్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు.
ముగ్గురు ఎమ్మెల్యేలపై మూడు వేర్వేరు సమయాల్లో పిటిషన్లు దాఖలైనందున నోటీసుల జారీకి ఆలస్యమైందని ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణలో మరింత స్పష్టత రాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!