Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Brs Also Supported Ndsa When It Enacted

Uttam Kumar Reddy: ఎన్డీఎస్ఏను కించపరిచేలా బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడం సరికాదు..

Published Date :April 29, 2025 , 5:16 pm
By Venkatesh
  • ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం
Uttam Kumar Reddy: ఎన్డీఎస్ఏను కించపరిచేలా బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడం సరికాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఘటనపై ఒక భాద్యత గల పౌరునిగా మాట్లాడుతున్న.. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది.. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసుకున్నారు.. తుమ్మిడిహెట్టి దగ్గర 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూ. 38 వేల కోట్లతో నాటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.. కొంత పని కూడా పురోగతిలోకి వచ్చింది.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.. బిఆర్ఎస్ ప్రాజెక్టు రిఇంజనీరింగ్, రిడిజైన్ చేశారు..

Also Read:BJP vs Congress: ‘‘కాంగ్రెస్‌కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు’’.. బీజేపీ విమర్శలు..

తుమ్మిడిహెట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామని, తట్టెడు మట్టిపోయాలేదు.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కు నష్టం జరిగింది.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే బ్యారేజ్ కూలి పోయింది.. కాళేశ్వరం రూ. 85 వేల కోట్లకు అనుమతి తీసుకున్నారు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వలేదు.. బిఆర్ ఎస్ హయాంలోనే నిర్మాణం జరిగింది, కూలిపోయింది వాళ్ళ హయాంలోనే… ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది వాళ్ళ హయాంలోనే.. ప్రాజెక్టులోని లోపాల కారణంగానే కూలిపోయింది అని రిపోర్టులో స్పష్టం చేశారు.. పార్లమెంట్ లో చేసిన చట్టం ద్వారా ఎన్డీఎస్ఏ ఏర్పడింది.. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అనవసర మాటలు మాట్లాడుతున్నారు.. రాష్ట్రం మీద దీని వల్ల లక్షన్నర కోట్ల భారం పడుతుంది..

Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

16 వేల కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పే పెద్ద తప్పు. ఎన్డీఎస్ఏను కించపరిచేలా బిఆర్ఎస్ పెద్దలు మాట్లాడం సరికాదు.. పార్లమెంటులో ఎన్డీఎస్ఏ చట్టం చేసినప్పుడు బిఆర్ఎస్ కూడా మద్దతు పలికింది..దేశంలో ని 5700 బ్యారేజ్ లు, ప్రాజెక్టులకు ఏది జరిగిన ఎన్డీఎస్ఏ వెళ్లి పరిశీలించి రిపోర్టు ఇస్తుంది. ఎన్డీఎస్ఏ లో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ఉంటారు. వారే పర్యవేక్షిస్తున్నారు. బిఆర్ఎస్ కంటే ఎన్డీఎస్ఏ కు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందని భావిస్తున్నా.. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని మేడిగడ్డకు మార్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పారు..

Also Read:Pistachio Nuts: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే వీటిని తినాల్సిందే!

వార్ధ దగ్గర కట్టేందుకు ప్రయత్నిస్తే సీడబ్ల్యూసీ ఒప్పుకోలేదు.. ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో లోపాలు బయట పడ్డాయి. కానీ బిఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు.. దీంతో తీవ్ర నష్టం జరిగింది.. ప్రాజెక్టుల్లో 2, 3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచుతారు. కానీ, ప్రాజెక్టుల్లో 14,15 టీఎంసీల నీటిని పబ్లిసిటీ కోసం నీటిని నిల్వ ఉంచారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏకు లేఖ రాశాము.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిన కమిటీలో చాలా అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు.

Also Read:Pahalgam terror Attack: ‘‘ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు, ఎంట్రీ గేట్‌ వైపు టూరిస్టుల పరుగులు’’.. వెలుగులోకి ఉగ్రవాదుల కుట్ర..

మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంపై 14 నెలలు పరిశీలించి, పరిశోధించి రిపోర్టు ఇచ్చారు.. మేడిగడ్డ లోకేషన్ పెద్ద మిస్టేక్.. అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ బ్యారేజ్ కూలింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉన్నారు.. ఎన్డీఎస్ఏ అక్టోబర్ 23న ప్రాజెక్టును పరిశీలించి ఇప్పుడు ఇచ్చిన రిపోర్టునే అప్పుడు ఇచ్చింది.. డ్యామ్ ముందు ఉన్న చెత్తాచెదారంను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు కూడా తొలగించలేదు.. అనేక రంద్రాలు పడ్డాయి. బేసిక్ ఫౌండేషన్ చాలా వీక్ అయ్యింది” అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Kaleshwaram project
  • NDSA
  • telangana
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions