Site icon NTV Telugu

Tragedy: విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Student Drown

Student Drown

Tragedy: సెలవు రోజులు జలగండాలవుతున్నాయి. సరదాతో కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇద్దరు అన్నదమ్ములు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుంలో చోటుచేసుకుంది. సదుంలోని రఘుపతి చెరువులో ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. మృతులు అభినాశ్(14), అశ్విన్(13)లుగా గుర్తించారు. చెరువులో మునిగిపోయిన పిల్లలను స్థానికులు బయటకు తీశారు. అప్పటికే పిల్లలు చనిపోవడంతో వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మారణహోమం.. వేర్వేరు ఘటనల్లో 18 మంది మృ‌తి..

Exit mobile version