New Shoes Dispute: కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. తమ్ముడిని హత్య చేసిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Shoes Dispute: కొత్త షూస్ వేసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం.. ఆ తర్వాత సీరియస్గా మారి తమ్ముడి హత్యకు దారి తీసింది.. Uttar Pradeshలోని Maharajganj Districtలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొత్త షూస్ విషయంలో అన్నదమ్ముల మధ్య మొదలైన చిన్న వివాదం చివరకు ఘోర విషాదానికి దారితీసింది. ఆగ్రహానికి గురైన అన్న తన తమ్ముడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: TGSRTC Strike: మరో 24 గంటల్లో ఆర్టీసీ సమ్మె.. చర్చలు ఫలిస్తాయా.?
Also Read
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
సమాచారం ప్రకారం, ఘుగ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌముఖ గ్రామం నౌకా టోలాలో ఈ ఘటన జరిగింది. సూరజ్ శర్మ అనే యువకుడు ఆన్లైన్లో కొత్త బూట్లు ఆర్డర్ చేశాడు. అయితే, వాటిని ముందుగా తానే వేసుకుంటానని తమ్ముడు లక్ష్మణ్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. చిన్న మాటల తగవు క్రమంగా పెద్ద గొడవగా మారింది. కోపోద్రిక్తుడైన సూరజ్, ఇంట్లో ఉన్న కత్తెర తీసుకుని తమ్ముడు లక్ష్మణ్పై దాడి చేశాడు. తలపై, చేయిపై పలుమార్లు దాడి చేయడంతో లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు.
ఘటనతో ఇంట్లో అరుపులు, ఏడుపులు మార్మోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన లక్ష్మణ్ను సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయగా, అక్కడికి చేరుకునేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామస్తులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న విషయానికి ఇంత పెద్ద విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు. క్షణిక కోపం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసి, అన్నను హంతకుడిగా మార్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
RJ Balaji: చరణ్తో సినిమా చేయాలని ఉంది.. దర్శకుడు ఆర్ జె బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు !
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
-
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?