RishiSunak: అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్న ఆ దేశ ప్రధాని, ఆయన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Britian Prime Minister RishiSunak Visited Akshardham Temple With His Wife Akshara Murty: జీ-20 సమావేశాల కోసం వివిధ దేశాల నేతలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సదస్సు కోసం భారత్ వచ్చిన వారిలో ఒకరైన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన విషయం విదితమే.ఆయన భారతదేశం ఎంతో గొప్పదని పేర్కొనడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన దేశమని వెల్లడించారు. ఇక ఆయన బ్రిటన్ ప్రధాని అయిన తరువాత ఆ హోదాలో భారత్ ను సందర్శించడం ఇదే తొలిసారి. తన భార్య అక్షరామూర్తితో కలిసి ఆయన భారత్ వచ్చారు. జీ-20 సమావేశాలకు హాజరైన సునాక్ రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురోగతిపై మోడీతో చర్చించారు. ఇక శుక్రవారం భారత్ కు వచ్చిన సునాక్ శనివారం అంతా కూడా జీ-20 సదస్సులో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం రిషి సునాక్ ఆయన భార్య అక్షరామూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్నారు. అక్కడ వారు దాదాపు గంట సేపు గడిపారు. బ్రిటన్ ప్రధాని రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ సిబ్బంది పూజా కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.
Also Read: Royal family: పన్నా మహారాణిని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక తాను హిందువుగా పుట్టినందుకు ఎంతో గర్వపడతానని సునాక్ చాలా సందర్భాల్లో తెలిపారు. తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి హిందు పద్దతులతో తనను పెంచారని ఆయన బాహాటంగానే ప్రకటించారు. ఈ మధ్య రక్షబంధన్ చేసుకున్నానని తెలిపిన సునాక్ జన్మాష్టమి చేసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు భార్య అక్షరమూర్తితో కలిసి ఆయన ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్నారు. భారత్ లో ఈ ఆలయాన్ని సందర్శిస్తానని ముందుగా సునాక్ మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. చెప్పినట్లుగానే ఈ రోజు గుడిని సందర్శించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!