యూపీలోని మీరట్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Read Also: Teacher Harassment: రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకం..
వివరాల్లోకి వెళ్తే.. ఖార్ఖోడాలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని.. కొంతకాలంగా ఓ యువకుడితో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ క్రమంలో.. ఓ రోజు ఆ యువకుడు విద్యార్థినిని అసభ్యకరమైన వీడియో తీసి వాట్సాప్లో షేర్ చేశాడు. ఈ విషయం యువతికి తెలియదు. ఆ వీడియో యువతి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో వైరల్గా మారింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఫిర్యాదు..
ఈ వీడియో గురించి ఎవరో విద్యార్థి కుటుంబీకులకు చెప్పడంతో కుంగిపోయారు. వారు ఇంటి నుంచి బయటకు రావడమే మానేశారు. అయితే… ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని మనస్తాపానికి గురైంది. ఆమె కళాశాలకు వెళ్లడం మానేసింది. తనతో పాటు, కుటుంబం పరువు పోయిందని మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.