Boy Traced: కాలువలో పడిన బాలుడి ఆచూకీ లభ్యం..కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కాలువలో పడిన బాలూడి ఆచూకీ కథ విషాదంగా మిగిలింది. కాలువలో పడిన బాలుడి కోసం గాలింపు చేపట్టారు. బాలుడు ఆచూకీ లభించింది. NAC కల్యాణమండపం వెనుక రోడ్ లో డ్రైన్ లో పడిపోయాడు అభిరామ్.. ఆయుష్ హాస్పటల్ సమీపంలో గుర్తించారు పోలీసులు..రెండున్నర కిలోమీటర్ల పాటు సైడు కాలువలో కొట్టుకువచ్చాడు అభిరామ్..బాలుడ్ని గుర్తించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే ఈ అన్వేషణ విషాదంగా ముగిసింది. డ్రైనేజీలో పడి రెస్క్యూ టీంకి దొరికినా.. కొన ఊపిరితో ఉన్నట్టు భావించి హాస్పటల్ కి తరలించారు పోలీసులు..అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు అభిరామ్. దీంతో అభిరామ్ కుటుంబంలో విషాదం నెలకొంది. అభిరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు.
అసలేం జరిగిందంటే?
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
విజయవాడలోని గురునానక్ కాలనీలో గల డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు శుక్రవారం గల్లంతయిన సంగతి తెలిసిందే. బాలుడు అభిరామ్ కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ నగరంలో వర్షం కురిసింది.. దీంతో గురునానక్ కాలనీలో డ్రైన్ లో వరద నీరు పోటెత్తింది. వర్షం తగ్గిన సమయలో డ్రైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఆ సమయంలో డ్రైన్ లో వరద పోటెత్తింది. స్నేహితులు అభిరామ్ ను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కూడా డ్రైన్ లో కి దిగి అభిరామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా అభిరామ్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సంఘలన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా అతని ఆచూకీ లభించింది. రో వైపు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కార్పోరేషన్ నిర్లక్ష్యం కారణంగానే డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు కొట్టుకుపోయాడని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు. బాలుడి మృతిపై విపక్షాలు మండిపడుతున్నాయి.
Read Also:Ravindar Singh : అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది
తాజావార్తలు
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!