Jharkhand Crime: ‘నాలుక కోసి, కళ్లు పీకి, యాసిడ్తో కాల్చి’.. గర్వాలో ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Crime: జార్ఖండ్లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు. అతని శరీరాన్ని యాసిడ్తో కాల్చి, రెండు కళ్లను బయటకు తీశారు. అంతే కాదు ఆ అమాయకుడి నాలుక కోసి పళ్లు విరగ్గొట్టి మృతదేహాన్ని ఇంటి సమీపంలో నిర్మిస్తున్న మరుగుదొడ్డి గుంతలో పడేశాడు.
ఈ ఘటన దండాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌలియా గ్రామంలో జరిగింది. గుంతలో నుంచి చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దండాయి పోలీస్ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం సాయంత్రం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. తన కుమారుడి హత్యపై చిన్నారి తండ్రి అవధేష్ షా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
Read Also:Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు
బల్లియా గ్రామానికి చెందిన అవధేష్ షా కుమారుడు గత రెండు రోజులుగా కనిపించకుండా పోయినట్లు సమాచారం. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు బాగా వెతికారు. కాగా, గురువారం సాయంత్రం గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి గుంతలోని నీటిలో మైనర్ మృతదేహం లభ్యమైంది. భూవివాదంలోనే ఈ ఘటన చోటుచేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నారిని చంపిన వ్యక్తి ఎవరో తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నిందితులను ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు. ఈ మేరకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని తండ్రి చెప్పాడు. అమాయకుడిని ఎందుకు చంపారో తెలియదు. అదే సమయంలో చిన్నారి హత్య ఘటనతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి అవేద్ షా డిమాండ్ చేశారు.
Read Also:Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!