Jammu & Kashmir: 32పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. లబోదిబోమంటున్న భర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu & Kashmir: కాశ్మీర్లో విచిత్రమైన ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 32మందిని పెళ్లి చేసుకుంది. విశేషమేంటంటే వారందరినీ చట్టబద్ధంగా చేసుకుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు పెట్టింది. వారందరినీ మోసం చేసి పరారైంది. ఇప్పటి వరకు ఆమె అసలు పేరు, గుర్తింపు, చిరునామా గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. మోసపోయిన వ్యక్తుల సంఖ్య ఇంకా సరిగా తెలియనప్పటికీ, బుద్గామ్, పుల్వామా, శ్రీనగర్, షోపియాన్ నాలుగు జిల్లాలకు చెందిన కనీసం 32 మంది పురుషులు.. దుండగుల ముఠాపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీనగర్లో నిరసనలు చేస్తున్నారు. వివాహ ఒప్పందాలలో అమాయక గ్రామస్తులను ట్రాప్ చేసి, వివాహం తర్వాత నగలు, డబ్బుతో పరారయ్యేది. గత నెల (జూన్ 3) బుద్గామ్లోని ఖాన్సాహిబ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అల్తాఫ్ మీర్ (48) అనే వ్యక్తి తన రెండు వారాల వధువు కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తన భార్య జహీన్ అక్తర్ ఆసుపత్రికి వెళ్లే సమయంలో కనిపించకుండా పోయిందని వరుడు పోలీసులకు చెప్పాడు. ఆ మహిళ జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉండబోతుంది. ఈ ఘటనకు పది రోజుల క్రితమే అల్తాఫ్కు వివాహమైంది. మహ్మద్ అల్తాఫ్ మీర్ తన డాక్యుమెంట్లను నకిలీవని పేర్కొన్నాడు. ఆమె అసలు పేరు ఎవరికీ చెప్పదు. మొదట్లో ఇదొక సాధారణ ఇంటి సమస్యగా భావించిన పోలీసులు.. తప్పిపోయిన మహిళ ఫొటోను పోలీసులు తమ నెట్వర్క్లో చూపించడంతో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ భార్యల మిస్సింగ్ రిపోర్టులతో దాదాపు డజన్ మందికి పైగా పురుషులు పోలీసులను ఆశ్రయించడంతో పాటు అన్ని కేసుల్లోనూ ఫిర్యాదుదారులు ఈ ఒక్క మహిళ చిత్రాలనే చూపడంతో పోలీసు వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయింది.
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
Read Also:tomato rate effect: 3 టన్నుల టమాటాలు స్మగ్లింగ్..ఇలా పట్టేశారు
అల్తాఫ్ తండ్రి అబ్దుల్ అహద్ మీర్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం రాజౌరికి చెందిన ఓ మహిళ పెళ్లి ఫొటోలు చూపించి వివాహ బ్రోకర్ తనను సంప్రదించాడని తెలిపారు. అల్తాఫ్ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం “ స్థానికంగా ఉండే మధ్యవర్తి నన్ను సంప్రదించి, అతను నా కొడుకు పెళ్లి చేస్తానని.. దానికి అతనికి రూ. 2 లక్షలు చెల్లించాలని చెప్పాడు. కుటుంబానికి చెందిన కొంతమంది బంధువులతో కలిసి నేను రాజౌరికి చేరుకుని కొన్ని హోటల్ గదులు బుక్ చేశాను.. అయితే మధ్యవర్తి పెళ్లిని ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని సగం డబ్బు నాకు తిరిగిచ్చిందని చెప్పారు. అల్తాఫ్ తండ్రి కొన్ని గంటల తర్వాత అతను డబ్బు తిరిగి అడిగాడు. మాకు మరొక అమ్మాయి చిత్రాలను చూపించాడు. మేము వివాహానికి అంగీకరించినప్పుడు ఇషా (రాత్రి ప్రార్థన) సమయంలో స్త్రీని తీసుకువచ్చారు. వివాహం తరువాత కుటుంబం అదే రాత్రి తిరిగి కాశ్మీర్కు తిరిగి వచ్చింది’.. అప్పటికీ అంతా బాగానే ఉంది.
అబ్దుల్ అహద్ మీర్ మాట్లాడుతూ, “కొన్ని రోజుల తర్వాత, ఆసుపత్రిలో చెకప్ చేయించుకోవాలని ఆమె తన భర్తకు చెప్పింది. భర్త ఆసుపత్రికి టికెట్ తీసుకోవడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి అతని భార్య అక్కడి నుండి అదృశ్యమైంది. మూడు లక్షల ఎనభై వేల నగదుతో పాటు ఐదు లక్షలకు పైగా విలువైన బంగారాన్ని మెహర్ (గ్యారంటీ)గా తీసుకున్నామని బాధితురాలి తండ్రి తెలిపారు.
Read Also:Health Tips: యాలకలను రోజూ ఇలా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
ఈ రాకెట్ పెద్దదని, ఇందులో చాలా మంది ప్రమేయం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అతను ఇంకా మాట్లాడుతూ, “ఈ ముఠాలో ఈ మహిళ భారిన పడిన వారు చాలా మందే ఉన్నారు. వివాహ పత్రాల్లో మహిళ పేరు జహీన్, ఇలియాస్, షాహినాగా కనిపిస్తుంది, కానీ ఆమె అసలు పేరు ఎవరికీ తెలియదు. కేవలం బుద్గామ్లోనే ఆమె కనీసం ఇరవై ఏడు (27) మంది పురుషులను బ్రోకర్ల సహాయంతో పెళ్లాడిందని, పుల్వామా, షోపైన్, శ్రీనగర్లోని చుట్టుపక్కల జిల్లాల్లో కూడా చాలా మంది పురుషులు ఆమె దోపిడీకి గురయ్యారని న్యాయవాది సూచించారు. బాధితుల సంఖ్య 50 కంటే ఎక్కువ ఉండవచ్చు, ఒక్కొక్కరి దగ్గరనుంచి 5 నుండి 10 లక్షల రూపాయల వరకు దోచుకున్నారని న్యాయవాది చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు మౌనం వహించిన పోలీసులు వ్యక్తిగత ఫిర్యాదులపైనే కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..