Boy Kidnap : ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం
- వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్
- మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్న ముఠా
- నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
Boy Kidnap : వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ నుంచి వచ్చిన భాషా భార్య గోరీబీ, ముగ్గురు కుమారులు, అత్తతో కలిసి గౌతాపూర్లోని మల్లన్న దేవాలయం వద్ద ఉంటున్నాడు. ఈనెల 29న రాత్రి గుడి వద్ద నిద్రించగా మరుసటి రోజు ఉదయం వారి ఏడాది వయస్సు ఉన్న హుస్సేన్ అనే బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాండూరు ఇందిరాగర్ చెదిన చరణ్, పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండే శంకర్, పద్మమ్మ, హన్మంతు, లక్ష్మీ, సాయమ్మలను నిందితులుగా గుర్తించారు. దీంతో వారిని వి చారించగా భాషా వద్ద ఉన్న చెత్త ఏరుకునే క్రమంలో భాషా కుటుంబంతో పరిచయం ఏర్పడింది.
November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
వారి వద్ద ఉన్న బాబును అపహరించి అమ్ముకునేందుకు ప్లాన్ వేసినట్లు తేలింది. 29న మద్యరాత్రి పద్మమ్మ, చరణ్, సాయమ్మలు కాపాలాగా ఉండగా శంకర్. హన్మంతు. లక్ష్మీలు బాబును ఎత్తుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఎత్తుకెళ్లిన బాబును పట్టణంలోని కృష్ణ అనే వ్యక్తికి విక్రయించేందుకు మాట్లాడుకున్నారు. కృష్ణకు మొత్తం ఆరుగురు అమ్మాయిలే ఉండడంతో బాబును కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యాడు.నిందితులు చెప్పిన విధంగా కోకట్ ఔటర్ రోడ్డు వద్ద నిందితుల నుంచి కృష్ణ రూ. 60 వేలకు బాబును కొ సుగోలు చేశాడు. వచ్చిన డబ్బులో ఆరుగురు నిందితులు రూ.10వేల చొప్పున సమానంగా పంచుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు బాలుడి కిడ్నాప్ కలకలం రేపడంతో కృష్ణ అనే వ్యక్తి బాలున్ని మర్పల్లి మండలం పాషాపూర్ కు తీసుకెళ్లాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణ నుంచి బాలుడిని స్వాదీనం చేసుకున్నారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులొ కి తీసుకుని విచారించడంతో బాలుడి కిడ్నాప్ కత సుఖాంతం అయ్యింది. ఇందులో నలుగురును రిమాండ్ చేయగా, హన్మంతు, లక్ష్మీలు పరారిలో ఉండగా స్వాదీనం చేసుకున్న బాలున్ని రూరల్ సీఐ నగేష్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అప్పగించారు.
karavali Teaser: భయపెడుతున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!