Botsa Satyanarayana: కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు!
- వైసీపీ ఓటమిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయన్న బొత్స
- కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు
- ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నేడు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
‘కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు, వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది, రైల్వే జోన్ పనులు ఏమైనా అసలు ప్రారంభించారా?. వైజాగ్లో ఏకరా భూమి 99 పైసలకు దారపోశారు. సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Also Read: AP Govt: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఇక నుంచి 180 రోజులు సెలవులు!
‘సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారు. సీఎం చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలి. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారు’ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గుడివాడ్ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, వరుదు కల్యాణి, శోభ హైమావతి తదితరులు హాజరయ్యారు.
- Tags
- ap
- botsa satyanarayana
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!