Botsa Satyanarayana: కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు!
- వైసీపీ ఓటమిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయన్న బొత్స
- కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు
- ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నేడు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
‘కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు, వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది, రైల్వే జోన్ పనులు ఏమైనా అసలు ప్రారంభించారా?. వైజాగ్లో ఏకరా భూమి 99 పైసలకు దారపోశారు. సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
Also Read: AP Govt: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఇక నుంచి 180 రోజులు సెలవులు!
‘సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారు. సీఎం చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలి. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారు’ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గుడివాడ్ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, వరుదు కల్యాణి, శోభ హైమావతి తదితరులు హాజరయ్యారు.
- Tags
- ap
- botsa satyanarayana
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!