Botsa Satyanarayana: కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు!
- వైసీపీ ఓటమిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలున్నాయన్న బొత్స
- కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు
- ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నేడు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
‘కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు, వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది, రైల్వే జోన్ పనులు ఏమైనా అసలు ప్రారంభించారా?. వైజాగ్లో ఏకరా భూమి 99 పైసలకు దారపోశారు. సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Also Read
Also Read: AP Govt: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఇక నుంచి 180 రోజులు సెలవులు!
‘సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారు. సీఎం చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలి. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారు’ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గుడివాడ్ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, వరుదు కల్యాణి, శోభ హైమావతి తదితరులు హాజరయ్యారు.
- Tags
- ap
- botsa satyanarayana
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!