Botsa Jhansi Lakshmi: విశాఖలో బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Jhansi Lakshmi: విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు. యాత్ర కు లక్షలాది మంది స్వచ్ఛందంగా హాజరయ్యారని తెలిపారు. బస్సు యాత్రపై కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Mamata Banerjee: కోల్కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన
పాదయాత్రకు ఏ విధంగా స్పందన లభించిందో దాన్ని మించి బస్సు యాత్రకు స్పందన లభిస్తోందని వెల్లడించారు. సీఎం జగన్ ను ప్రజలు నమ్మి యాత్రకు తరలివస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ పాలనలో పేదరికం తగ్గిందన్నారు. ప్రజల గుండెల్లో జగన్ కొలువై ఉన్నారని కొనియాడారు. బస్సు యాత్ర ద్వారా కూటమికి విశాఖలో బలము లేదన్న విషయం తేలిపోయిందని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత సీఎం జగన్ ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మీద అభిమానంతో విశాఖలో నిన్న జరిగిన సిధ్ధం బస్సు యాత్రకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారన్నారు. మా బలం ఓట్లు రూపంలో చూపిస్తామని తెలిపారు. గెలిచిన తర్వాత విశాఖలో ఘనంగా సంబరాలు చేసుకుంటామని చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ.. సీఎం బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించిందన్నారు. ప్రజలకు సీఎం జగన్ ఒక భరోసా కల్పించారన్నారు. మళ్లీ జగనన్నే ముఖ్య మంత్రి అవుతతారని ఆకాంక్షించారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చబోతున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే జగనన్నకు ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!