విజయవాడ రైల్వేస్టేషన్కి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని.. పాకిస్థాన్కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పేరుతో ఫోన్ చేశారని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కోట జోజి తెలిపారు. “స్టేషనులో బాంబు పెట్టాం అని కాల్ చేసిన హుస్సేన్ చెప్పాడు.. ఫోన్ ట్రాక్ చేస్తే ఆర్ఆర్ పేట రైల్వే లైను వద్ద సిగ్నల్ వచ్చింది. కాల్ వచ్చినపుడు ముంబై నుంచీ విశాఖ వెళ్ళే రైలు వెళ్ళింది.. ఆ రైలును కూడా పూర్యిగా తనిఖీ చేశాం.. ప్రజలు భయపడాల్సిన పని లేదు.. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటాం..” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Mahesu Goud: ఓల్డ్ ఏజ్ హోమ్లో ఘనంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
కాగా.. బాంబు బెదిరింపు ఫోన్ రాగానే.. అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై- విశాఖ రైలులో తనిఖీలు జరిపారు. విజయవాడ పోలీసులు ఇచ్చిన సమాచారంతో బాంబ్స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టారు. S 2లో అనుమానిత బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. బ్యాగు తెరిచి చూడగా బట్టలు, సబ్బులు, ఆధార్ కార్డ్ లభ్యమయ్యాయి.. ఆధార్ కార్డు ప్రకారం.. యూపీకి చెందిన శ్రీరామ్ తివారీగా పోలీసులు గుర్తించారు. బాంబు లేక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
READ MORE: TPCC Mahesh Goud : దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్హౌస్కి పరిమితమయ్యారు