Blind T20 World Cup: టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకున్న పాకిస్థాన్
- టీ20 ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకున్న పాకిస్థాన్
- ఫైనల్ లో బంగ్లాదేశ్ పై విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blind T20 World Cup Won Pakistan: అంధుల టీ20 ప్రపంచ కప్ టైటిల్ను పాకిస్తాన్ గెలుచుకుంది. ఫైనల్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. పాక్ జట్టు ఈ టైటిల్ గెలవడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది. టార్గెట్ ఛేదనలో పాకిస్థాన్ కేవలం 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని మొదటిసారి అంధుల ప్రపంచకప్ను గెలుచుకుంది. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ నిసార్ అలీ అజేయంగా 72 పరుగులు చేయగా, మహ్మద్ సఫ్దర్ అతనికి మద్దతుగా నిలిచి అజేయంగా 47 పరుగులు చేశాడు. ఈ విజయం పాకిస్థాన్కు చిరస్మరణీయమైనది. దీనికి కారణం, ఈ మొత్తం టోర్నమెంట్లో ఎవరూ వారిని ఓడించలేకపోయారు. పాకిస్థాన్ అంధుల క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ సుల్తాన్ షా ఈ ఘనత సాధించిన తమ జట్టును అభినందించారు. తొలి ఇన్నింగ్స్లో పాక్ బౌలర్ బాబర్ అలీ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మహ్మద్ సల్మాన్, మతివుల్లా ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Firing At Golden Temple premises: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న నేత
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
PAKISTAN WIN THE BLIND CRICKET T20 WORLD CUP TITLE 🇵🇰❤️❤️❤️
What a stunning 10-wicket win against Bangladesh in the final in Multan. This is how you do it without India. Another very successful event, padosiyo 🇮🇳🔥🔥
— Farid Khan (@_FaridKhan) December 3, 2024
ఈ అంధుల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ 2012 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత భారత జట్టు 2017, 2022లో ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. అంధుల టీ20 ప్రపంచకప్లో టైటిల్ హ్యాట్రిక్ సాధించిన భారత్ ఈసారి టోర్నీలో పాల్గొనలేకపోయింది. అంధుల టి20 ప్రపంచ కప్ను పాకిస్తాన్లో నిర్వహించడం వలన, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన వివాదం కారణంగా, భారత ప్రభుత్వం తమ అంధుల జట్టును సరిహద్దు దాటి పంపడానికి నిరాకరించింది. అంధుల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్కు చేరింది. 2012, 2017 ఎడిషన్లలో వారు భారత్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టు ఓటమి ట్రెండ్కు స్వస్తి పలికి తొలి టైటిల్ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!