దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నేరడి గొండ పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది.
Also Read:Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
ముఠాలోని నలుగురి అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల నెల లక్షల్లో వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వాహన యజమానులు డబ్బు ఇవ్వకుంటే ముఠా సభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తేల్చారు. మహారాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ సందీప్ కీలకంగా వ్యవహరిస్తూ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.