Bandi Sanjay: మిషన్ 90 ప్లాన్.. పక్కా అధికారం మాదే అంటున్న బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో చేరికలు వేగం పెంచాలని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో బీజేపీ మరో సారి స్పీడ్ పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. బీజేపీ గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ వారిగా బీజేపీ సంస్థాగతంగా శక్తివంతంగా ఏర్పాటు చేశాం.. ఒక్కో అసెంబ్లీ కి నలుగురుని నియమించామన్నారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్.
Read Also: Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
రాష్ట్ర పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు.. బీఆర్ఎస్ బ్యానర్ మీద పోటీ చేయడానికి ప్రతీ నియోజకవర్గంలో నాయకులు పోటీపడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కావాలనే తమ మీద పోటీకి అభ్యర్థులు లేరని విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. 119 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ బీజేపీ.. బీఅరెస్ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి.. ఉంటే ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పైసలు ఇస్తున్నాడని బండి సంజయ్.. అధికారపార్టీ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటికైనా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. మిషన్ 90 అంటే 90 స్థానాలు గెలుస్తాం.. కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బండి.. పాలకులు ప్రతి నెల వారికి కేటాయించిన నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించాలని సూచించారు. విస్తరక్ లు ఫుల్ టైం వారికి కేటాయించిన నియోజకవర్గంలో పని చేయాలన్నారు. 15 నుండి ప్రతి రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 13, 14 లలో ప్రధాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించి భారీ సభ ఏర్పాటు చేయనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
తాజావార్తలు
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!