BJP Muralidhar Rao : ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, బూతుల పార్టీ బీఆర్ఎస్ అవకాశం దొరికితే బూతు డిక్షనరీ ఓపెన్ చేయాల్సిన దుస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదని, హరీష్ రావు, ఆయన మామ పుట్టక ముందు, కాంగ్రెస్ పుట్టక ముందే హైదరాబాద్ ధనిక నగరంగా ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘పొలిటికల్ ప్రాముఖ్యత కలిగిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం నిజాం కంటే ముందు కూడా ఉంది. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారాలకు, కళలకు మారుపేరు హైదరాబాద్. హైదరాబాద్ పై చర్చకు హరీష్ సిద్దంగా ఉన్నారా ? బీఆర్ఎస్ పుట్టకకు హైదరాబాద్ కు సంబంధం లేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు కష్టపడితే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముంబై కన్నా తెలుగు సినిమా నిర్మాణం వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది.. దీంట్లో BRS ప్రభుత్వ పాత్ర ఎంటి ? వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారడంలో BRS పాత్ర ఎంటి ? ఐటీ ఉత్పత్తుల్లో BRS పాత్ర ఎంటి ? హైదరాబాద్ లో BRS మాఫియా సామ్రాజ్యం పోతే ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో దేవాలయాల భూములు కబ్జాలు చేశారు.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్.. భవిష్యత్ లో పార్టనర్స్ వ్యవసాయ మోటార్ల సంఖ్య గతంలో 18 లక్షలు కాగా.. ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. సాగునీరు పెరిగితే బోర్లు.. వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగింది ? బీఆర్ఎస్, కాంగ్రెస్ కరెంట్ పై అనవసర చర్చతో అసలు విషయాలపై చర్చ రాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద ఘటనను ఖండించింది ప్రధాని మోడీ. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. హమాస్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే భారత దేశంలో స్థానంలో లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హమాస్ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, హింసకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతుగా ర్యాలీలు ఉండవు హమాస్ ను ఖండిస్తూ.. కేసీఆర్ ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అన్నీ అంశాలతో చార్జిషీట్ విడుదల చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే.’ అని మురళిధర్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!