BJP Muralidhar Rao : ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, బూతుల పార్టీ బీఆర్ఎస్ అవకాశం దొరికితే బూతు డిక్షనరీ ఓపెన్ చేయాల్సిన దుస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదని, హరీష్ రావు, ఆయన మామ పుట్టక ముందు, కాంగ్రెస్ పుట్టక ముందే హైదరాబాద్ ధనిక నగరంగా ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘పొలిటికల్ ప్రాముఖ్యత కలిగిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం నిజాం కంటే ముందు కూడా ఉంది. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారాలకు, కళలకు మారుపేరు హైదరాబాద్. హైదరాబాద్ పై చర్చకు హరీష్ సిద్దంగా ఉన్నారా ? బీఆర్ఎస్ పుట్టకకు హైదరాబాద్ కు సంబంధం లేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు కష్టపడితే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముంబై కన్నా తెలుగు సినిమా నిర్మాణం వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది.. దీంట్లో BRS ప్రభుత్వ పాత్ర ఎంటి ? వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారడంలో BRS పాత్ర ఎంటి ? ఐటీ ఉత్పత్తుల్లో BRS పాత్ర ఎంటి ? హైదరాబాద్ లో BRS మాఫియా సామ్రాజ్యం పోతే ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో దేవాలయాల భూములు కబ్జాలు చేశారు.
Also Read
- Siddaramaiah: "నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు".. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
- Toilet Cleaning Tips: టాయిలెట్ సీటుపై జిడ్డు మరకలు పోవట్లేదా..? నిమిషాల్లో మెరిసేలా చేసే చిట్కాలు ఇవే..
- Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్.. భవిష్యత్ లో పార్టనర్స్ వ్యవసాయ మోటార్ల సంఖ్య గతంలో 18 లక్షలు కాగా.. ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. సాగునీరు పెరిగితే బోర్లు.. వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగింది ? బీఆర్ఎస్, కాంగ్రెస్ కరెంట్ పై అనవసర చర్చతో అసలు విషయాలపై చర్చ రాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద ఘటనను ఖండించింది ప్రధాని మోడీ. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. హమాస్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే భారత దేశంలో స్థానంలో లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హమాస్ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, హింసకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతుగా ర్యాలీలు ఉండవు హమాస్ ను ఖండిస్తూ.. కేసీఆర్ ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అన్నీ అంశాలతో చార్జిషీట్ విడుదల చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే.’ అని మురళిధర్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
-
Siddaramaiah: “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు”.. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
-
Obsession : 0.75 మిలియన్ డాలర్లతో సినిమా తీసిన యూట్యూబర్.. కలెక్షన్ల వర్షం కురిపించిన ఆడియన్స్
-
Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
-
Toilet Cleaning Tips: టాయిలెట్ సీటుపై జిడ్డు మరకలు పోవట్లేదా..? నిమిషాల్లో మెరిసేలా చేసే చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!