BJP Muralidhar Rao : ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, బూతుల పార్టీ బీఆర్ఎస్ అవకాశం దొరికితే బూతు డిక్షనరీ ఓపెన్ చేయాల్సిన దుస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మీ బూతుల సంస్కృతి నడవదని, హరీష్ రావు, ఆయన మామ పుట్టక ముందు, కాంగ్రెస్ పుట్టక ముందే హైదరాబాద్ ధనిక నగరంగా ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘పొలిటికల్ ప్రాముఖ్యత కలిగిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ నగరం నిజాం కంటే ముందు కూడా ఉంది. 450 సంవత్సరాలకు పైగా వ్యాపారాలకు, కళలకు మారుపేరు హైదరాబాద్. హైదరాబాద్ పై చర్చకు హరీష్ సిద్దంగా ఉన్నారా ? బీఆర్ఎస్ పుట్టకకు హైదరాబాద్ కు సంబంధం లేదు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు కష్టపడితే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముంబై కన్నా తెలుగు సినిమా నిర్మాణం వేగంగా హైదరాబాద్ లో జరుగుతుంది.. దీంట్లో BRS ప్రభుత్వ పాత్ర ఎంటి ? వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారడంలో BRS పాత్ర ఎంటి ? ఐటీ ఉత్పత్తుల్లో BRS పాత్ర ఎంటి ? హైదరాబాద్ లో BRS మాఫియా సామ్రాజ్యం పోతే ఇంకా అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో చెరువులు కబ్జాలకు గురి అయ్యాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో దేవాలయాల భూములు కబ్జాలు చేశారు.
Also Read
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
- Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్.. భవిష్యత్ లో పార్టనర్స్ వ్యవసాయ మోటార్ల సంఖ్య గతంలో 18 లక్షలు కాగా.. ఇప్పుడు 25 లక్షలకు పెరిగింది. సాగునీరు పెరిగితే బోర్లు.. వ్యవసాయ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగింది ? బీఆర్ఎస్, కాంగ్రెస్ కరెంట్ పై అనవసర చర్చతో అసలు విషయాలపై చర్చ రాకుండా పక్కదారి పట్టిస్తున్నారు. హమాస్ ఉగ్రవాద ఘటనను ఖండించింది ప్రధాని మోడీ. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. హమాస్ కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే భారత దేశంలో స్థానంలో లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హమాస్ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదానికి, హింసకు మద్దతుగా ర్యాలీలు తీస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది.? బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతుగా ర్యాలీలు ఉండవు హమాస్ ను ఖండిస్తూ.. కేసీఆర్ ఒక్క స్టేట్ మెంట్ ఇవ్వలేదు. బీజేపీ అన్నీ అంశాలతో చార్జిషీట్ విడుదల చేస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్ గోత్రాలు ఒక్కటే.’ అని మురళిధర్ రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
-
Vivo T5 Lite 5G: వివో T5 Lite 5G త్వరలో భారత్లోకి.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
-
RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?