GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే.. ఇప్పటికైనా మేల్కోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: సముద్రాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ వాసుల గొంతు కోసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మేల్కోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం.. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ లోని సముద్రతీరాలు పట్ల నిర్లక్ష్యం వహించడం బాధాకరం అన్నారు. నగరంలోని వ్యర్ధాలు డ్రైనేజీ ద్వారా నేరుగా వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. విశాఖ లోని సముద్ర తీర ప్రాంతం వ్యర్ధాలతో పూర్తిగా నిండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో పర్యాటక రంగాన్ని 10 రెట్లు పెంచొచ్చు.. కానీ, ఇటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం అన్నారు. కాలుష్యం కారణంగా 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్ల సముద్ర తీరం కుదించుకుపోయింది. విశాఖలో సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సముద్ర తీరాన్ని నిర్లక్ష్యం చేస్తే విశాఖ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందన్నారు. తక్షణమే వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!