Usha Thakur: రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలి.. మహిళా మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rapists should be hanged publicly to reduce crime, comments Minister Usha Thakur: మధ్యప్రదేశ్ మహిళా మంత్రి అత్యాచార నిందితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్ ఖాండ్వాలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచార ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఉషా ఠాకూర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాని.. అప్పుడే నేరాలు తగ్గుతాయని ఆమె అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థిస్తానని అన్నారు. రేపిస్టులను బహిరంగా ఉరితీసినప్పుడే.. మరొకరు ఈ నేరాలకు పాల్పడకుండా భయం పుడుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా ఉన్నారు ఉషా ఠాకూర్.
Read Also: Tiger attacks: బాబోయ్ పులులు.. ఎడాపెడా దాడులు
Also Read
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోందని.. కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో రేపిస్టులకు మరణశిక్ష విధించే నిబంధనలను రూపొందించిన మొదటిరాష్ట్రం మధ్యప్రదేశే ఉషా ఠాకూర్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 72 మంది నేరస్తులకు ఉరిశిక్ష విధించారని తెలిపారు. ఇలాంటి నేరాలు సమాజంలో మళ్లీ మళ్లీ చోటు చేసుకోవడం ఫోర్త్ ఎస్టేట్, మీడియా, మనందరికి ఆందోళన కలిగించే విషమని అన్నారు.
ఇలాంటి నేరాలు జరకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలని.. ఎవరైనా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే అటువంటి నేరస్తులను బహిరంగ కూడళ్ల వద్ద శిక్ష విధించాలని ముఖ్యమంత్రిని కోరుతా అని అన్నారు. జైలులో ఇలాంటి శిక్షలు విధిస్తే..ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఖాండ్వాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసి నిందితుడు చెరుకుతోటలో బాలికను వదిలివెళ్లారు. అపస్మారస్థితిలో ఉన్న చిన్నారికి ప్రస్తుతం ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు వేరే జిల్లాలో అత్యాచారం కేసులో పట్టుబడ్డాడు. మంత్రి ఉషా ఠాకూర్ ఇద్దరి నిందితుల గురించి మాట్లాడుతూ.. బహిరంగ ఉరిని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?