Karnataka: బీజేపీ-జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు.. ఎన్నెన్ని సీట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి రాధా మోహన్ దాస్ అగర్వాల్ శనివారం ప్రకటించారు.
మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేయనుండగా, జేడీఎస్ 3 సీట్లలో బీజేపీ మద్దతుతో పోటీ చేయనుంది. కర్ణాటలో లోక్సభ ఎన్నికల పోలింగ్ రెండో విడతల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 26న, మూడో ఫేజ్లో భాగంగా మే 7న జరుగనున్నాయి.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
- Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
రెండో విడత పోలింగ్లో కర్ణాటకలోని 14 సీట్లకు పోలింగ్ జరగనుంది. వాటిలో బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, చామరాజనగర్, చిక్బల్లాపూర్, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, హస్సన్, కోలార్, మాండ్య, మైసూరు, తుంకూరు, ఉడిపి చిక్మగళూరు ఉన్నాయి.
మూడో దశలో మిగిలిన 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాటిలో చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బిజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారీ, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దేవనాగెరె, షిమోగా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి రికార్డ్ స్థాయిలో సీట్లు సాధించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధించాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు మోడీ కూడా ప్రజలకు విజ్ఞప్త చేస్తున్నారు. వికసిత భారత్కు మద్దతు తెల్పాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి హార్ట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు ఈసారి సీటు దక్కలేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇక కాంగ్రెస్ కూడా కర్ణాటకలో అభ్యర్థులను ప్రకటించింది.
#WATCH | Bengaluru: On seat sharing with JDS, Karnataka state election in-charge Radha Mohan Das Agarwal says, "BJP and JDS have decided to contest on 28 seats. BJP will contest on 25 seats with the support of JDS, and JDS will contest on 3 seats with the support of BJP." pic.twitter.com/yLCpeVNejI
— ANI (@ANI) March 23, 2024
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!