BJP: తెలంగాణపై హైకమాండ్ ఫోకస్.. కమలం పార్టీలో కీలక మార్పులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య గొడవలను సమసిపోయేలా చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ హైకమాండ్..రాష్ట్ర పార్టీ నేతలంతా కలసికట్టుగా పనిచేసేలా చూడడంపై దృష్టి కేంద్రీకరించింది. కీలక నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరుగుతుందని, తద్వారా ఎన్నికల్లో దూసుకుపోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీరియస్గా కసరత్తు చేస్తోంది హైకమాండ్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై కొంతకాలంగా కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న నేతలకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య గ్యాప్ పెరిగడంతో ఈ అంతరాన్ని తగ్గించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
బండి సంజయ్ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలోకి ఎవరు వస్తారు..అంటే…ప్రధానంగా వినిపిస్తున్న పేరు డీకే అరుణ. ఒక వేళ బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిస్తే… డీకే అరుణకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈటల రాజేందర్కు కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ ఒక్కరే ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. కీలకమైన ఈ మార్పుచేర్పులన్నీ నాలుగైదు రోజుల్లోనే జరగనున్నట్లు కమలనాథుల నోట ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మంలో అమిత్ షా భారీ బహిరంగసభకు ముందుగానే ఈ మార్పులు చేస్తారని తెలుస్తోంది.
Also Read
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
- YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకత్వాల్లోనే కాదు, కేంద్ర కేబినెట్లోనూ మార్పు చేర్పులుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అటు కేంద్ర కేబినెట్లో కానీ, ఇటు తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కానీ సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని మార్పులు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!