Uddhav Thackeray: ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అందుకోసమే.. ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోంది.. యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దవ్ థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. థాక్రేతో షిండే తెగతెంపులు చేసుకోవడంతో గత ఏడాది జూన్ లో మమా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం కూలిపోయింది.
Read Also: Vimanam: జీ 5లో దూసుకెళ్తోన్న ‘విమానం’.. ఏకంగా 50 మిలియన్ మినిట్స్!
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఆ తర్వాత బీజేపీతో కలిసిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రధాని తమదని చెప్పుకుంటున్న బీజేపీ ఇతర పార్టీలను ఎందుకు చీల్చాల్సిన అవసరం ఉందని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. మీరు శివసేన పార్టీలో చీలికలు తెచ్చారు.. ఇప్పుడు ఎన్సీపీని కూడా చీల్చుతున్నారు.. రేపు మీరు ఇంకేదైనా పార్టీలో చీలికలు తీసుకురావొచ్చు అని ఆయన కామెంట్స్ చేశారు. దేశానికి చెందిన వాటిని అమ్మేసి ఇతరులకు దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ముందు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అని క్యశ్చన్ చేశారు. బీజేపీ అధికార దాహంతోనే ఇలాంటి పని చేస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Video Viral: కళ్లకు గంతలు కట్టుకున్న భలే కొట్టాడే.. వీడియో వైరల్..!
మహారాష్ట్రలో ఏమీ లేని బీజేపీని శివసేన తన భుజస్కంధాలపై మోసుకుని రాష్ట్రంలో పునాదిని విస్తరించేందుకు దోహదపడిందని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇప్పుడు మమ్మల్నే రాజకీయాల్లో అంతమొందించాలని చూస్తున్నారు.. ఇది మీ హిందుత్వ పార్టీ అన్నారు. ఎన్నికలు ముగిశాక యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని పక్కన పెట్టారని మాజీ సీఎం ఠాక్రే మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీకి ఒరిగేదేమీ లేదు.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నాం.. కానీ దానిని తీసుకువచ్చే దమ్ము ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!