Uddhav Thackeray: ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అందుకోసమే.. ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోంది.. యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దవ్ థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. థాక్రేతో షిండే తెగతెంపులు చేసుకోవడంతో గత ఏడాది జూన్ లో మమా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం కూలిపోయింది.
Read Also: Vimanam: జీ 5లో దూసుకెళ్తోన్న ‘విమానం’.. ఏకంగా 50 మిలియన్ మినిట్స్!
Also Read
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ఆ తర్వాత బీజేపీతో కలిసిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రధాని తమదని చెప్పుకుంటున్న బీజేపీ ఇతర పార్టీలను ఎందుకు చీల్చాల్సిన అవసరం ఉందని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. మీరు శివసేన పార్టీలో చీలికలు తెచ్చారు.. ఇప్పుడు ఎన్సీపీని కూడా చీల్చుతున్నారు.. రేపు మీరు ఇంకేదైనా పార్టీలో చీలికలు తీసుకురావొచ్చు అని ఆయన కామెంట్స్ చేశారు. దేశానికి చెందిన వాటిని అమ్మేసి ఇతరులకు దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ముందు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అని క్యశ్చన్ చేశారు. బీజేపీ అధికార దాహంతోనే ఇలాంటి పని చేస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Video Viral: కళ్లకు గంతలు కట్టుకున్న భలే కొట్టాడే.. వీడియో వైరల్..!
మహారాష్ట్రలో ఏమీ లేని బీజేపీని శివసేన తన భుజస్కంధాలపై మోసుకుని రాష్ట్రంలో పునాదిని విస్తరించేందుకు దోహదపడిందని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇప్పుడు మమ్మల్నే రాజకీయాల్లో అంతమొందించాలని చూస్తున్నారు.. ఇది మీ హిందుత్వ పార్టీ అన్నారు. ఎన్నికలు ముగిశాక యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని పక్కన పెట్టారని మాజీ సీఎం ఠాక్రే మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీకి ఒరిగేదేమీ లేదు.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నాం.. కానీ దానిని తీసుకువచ్చే దమ్ము ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!