Site icon NTV Telugu

Somu Veerraju: రాష్ట్రంలో ఇసుక.. మట్టి… సిలికా..గనుల దోపిడీ

Somu Veerraju

Somu Veerraju

నెల్లూరు జిల్లాలో బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై అహంకారపూరిత ఆలోచనతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పాలనలో దేశం దివాలా తీసింది. దేశంలో అవినీతి రహిత పాలనను మోడీ అందిస్తున్నారు.రాష్ట్రంలో ఇసుక.. మట్టి. సిలికా. గనుల దోపిడీ జరుగుతోంది. అధికారులతో కలిసి అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. కృష్ణ. గోదావరి తో పాటు నదుల్లో ఇసుకను యంత్రాల ద్వారా తవ్వుతున్నారు.

Read Also:CM KCR: నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ఇదే..

ఈ విషయంలో మార్పు రాకపోతే రీచ్ ల వద్దకు బిజెపి నేతలు వెళ్లి ఆందోళన చేస్తారు. క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. కొన్ని చర్చిలకు విలువైన భూములను కట్టబెడుతున్నారు. రాష్ట్రాన్ని మతరాజ్యం చేయకుండా బిజెపి పోరాటం చేస్తుందన్నారు సోము వీర్రాజు.

Read Also: Undavalli Sridevi: నన్ను ఎందుకు వేధిస్తున్నారు?

Exit mobile version