Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

  • మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు
  • స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం
  • మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం
Biyyapu Madhusudhan Reddy

Biyyapu Madhusudhan Reddy

Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ

ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి శారద పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అధికారికంగా విధులు నిర్వహిస్తున్న తమను మాజీ ఎమ్మెల్యే దూషించారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి టౌన్ పోలీసులు మధుసూధన్‌రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Pranaya Godari: ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం: ‘ప్రణయ గోదారి’ దర్శకుడు!