shocking incident from Bihar: బీహార్లో దారుణం.. స్తంభానికి కట్టేసి ఛీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
shocking incident from Bihar: కొన్ని సంఘటనలు చూస్తే మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందనే అనుమానం వస్తుంటుంది. కానీ కొందరు ఆ అనుమాలను వారి ప్రవర్తనతో నిజమని చెప్పకనే చెబుతున్నారు. అచ్చం అలాంటే ఘటనే బీహార్లో వెలుగుచూసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టి, ఆపై వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దారుణమైన సంఘటన కతిహార్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Vijayawada: వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్హోల్లో పడి టీడీపీ నేత మృతి..!
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
కనికరం లేకుండా కొట్టి.. ఆపై
బీహార్లోని బరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కతిహార్లో గ్రామస్థులు అదే గ్రామానికి చెందిన ఉమేష్ మండల్, మహ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరు వ్యక్తులను మంత్రలు చేస్తున్నారనే అనుమానంతో స్తంభానికి కట్టేసి చితక్కోట్టారు. అనంతరం మానవత్వం అనేది మరచి వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బరారి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ గ్రామస్థుల చెర నుంచి రక్షించారు. అనంతరం బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. బాధితులిద్దరిని కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులిద్దరూ మంత్రాలు చేస్తున్నరనే గ్రామస్థుల వాదనపై కూడా విచారణ చేస్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలు తప్పు చేశారని పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతూ పోస్టులు పెడుతున్నారు.
READ MORE: Modi Trump meeting: సుంకాల సెగలో ప్రధాని మోడీ.. ట్రంప్ను కలుస్తారా?
తాజావార్తలు
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!