Bihar Elections 2025: బీహార్లో షాకింగ్.. రోడ్డుపై VVPAT స్లిప్పులు లభ్యం..! ఈసీపై అనుమానాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. “సమస్తిపూర్ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..? కమిషన్ దీనికి సమాధానం ఇస్తుందా? బయటి నుంచి వచ్చి బీహార్లో మకాం వేసిన ప్రజాస్వామ్య దొంగ ఆదేశం మేరకు ఇదంతా జరుగుతుందా?” అని ప్రశ్నించింది.
READ MORE: IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన గబ్బా T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం
Also Read
- Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
- Vaibhav Sooryavanshi: వైభవ్ "New Chapter" పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ సత్వర చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ARO)ను సస్పెండ్ చేశారు. ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సమస్తిపూర్ జిల్లా ఎన్నికల అధికారి (జిల్లా మేజిస్ట్రేట్) సంఘటన స్థలాన్ని సందర్శించి, దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ VVPAT స్లిప్లను మాక్ పోల్ సమయంలో ఉపయోగించారని, ARO నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎన్నికల సంఘం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది వాస్తవ ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులందరికీ జిల్లా మేజిస్ట్రేట్ సమాచారం అందించింది.
READ MORE: Motorola Edge 50 pro: మోటరోలా ఫోన్ పై క్రేజీ డీల్.. రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే.. కర్వ్డ్ డిస్ప్లేతో
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరిగింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం పోలింగ్ నిర్వహించారు. EVMలు, VVPATల పనితీరును పరీక్షించేందుకు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. ఓటింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత, శీతల్పట్టి గ్రామంలోని చెత్తలో VVPAT స్లిప్లు కనిపించాయి. మహా కూటమిలోని పార్టీలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. వివాదం తీవ్రమవుతున్నట్లు గమనించిన సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా, పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ ప్రతాప్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిపక్ష పార్టీలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
-
Preity Zinta: AI డీప్ఫేక్లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!