Bihar Assembly Elections 2025: బీహార్లో ఎన్డీఏ ఎన్నికల పొత్తు పొడిచింది.. ఏయే పార్టీలకు ఎన్నెన్ని సీట్లు అంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Assembly Elections 2025: దేశ వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఒంటరి పోరుకు సిద్ధమై తొలి విడతలో భాగంగా 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ తొలి విడతలో భాగంగా 51 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేశారు. ఇండియా కూటమిలో దాదాపు సీట్ల పంపకంపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు అందరి చూపు ఎన్డీఏ కూటమి వైపు ఉంది.
READ ALSO: Perni Nani: ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా.. పోలీసులు వినిపించుకోవడం లేదు!
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
రేపు ప్రకటించనున్న ఎన్డీఏ అగ్రనాయకులు
ఎన్డీఏ కూటమి అగ్రనాయకులు అక్టోబర్ 11న అధికారిక సీట్ల పంపకాల ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. BJP, JDU, LJP (రామ్ విలాస్), HAM, RLM వంటి పార్టీల అగ్ర నాయకులతో సహా అన్ని ప్రధాన NDA నాయకులు ప్రకటన సమయంలో హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ కూటమిలోని అన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించి సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయానికి వచ్చింది. శనివారం ఢిల్లీలో బీజేపీ కీలక నాయకుల సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత ఎన్డీఏ సీట్ల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ సీట్ల పంపకాల ప్రక్రియకు నాయకత్వం వహిస్తుందని, కూటమి పార్టీలకు సరైన విధంగా సీట్ల పంపకాలు చేపడుతుందని అంటున్నారు. అనేక రోజుల నిరీక్షణ, చర్చల తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్ని కూడా చివరకు ఒక సాధారణ ఫార్ములాపై అంగీకరించాయని సమాచారం.
బీజేపీ, జేడీయూ మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరిందని, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జెపి (రామ్ విలాస్) 25-26 సీట్లు, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హెచ్ఏఎం పార్టీ 7-8 సీట్లు, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎం 5-6 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. సీట్ల పంపకాలకు సంబంధించి రేపు జరిగే విలేకరుల సమావేశంలో అధికారిక ప్రకటన రానుంది. ఈ ప్రకటనతో కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని, అన్ని పార్టీలు ఐక్యంగా ఎన్నికలలో పోటీ చేస్తాయనే సందేశాన్ని ప్రజలకు, ప్రతిపక్షాలకు పంపాలని ఎన్డీఏ ఆశిస్తుంది. బీజేపీ వర్గాల ప్రకారం.. “ఈ సీట్ల పంపకాల ఏర్పాటు సంఖ్యల గురించి మాత్రమే కాదు, గౌరవం గురించి కూడా” అని పేర్కొన్నారు. సీట్ల పంపకాల ప్రకటనతో పాటు ఎన్డీఏ తన మొదటి ఉమ్మడి ప్రచారాన్ని ప్రకటించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..