Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన జేఎంఎం పార్టీ తాజాగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
READ ALSO: Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
రాష్ట్రంలో కీలక పరిణామాలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరిది. నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ క్రమంలో JMM మహా కూటమిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కూటమిలో రాజకీయ అవకతవకలు జరిగాయని, ఫలితంగా తమ పార్టీ బీహార్ ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందని వెల్లడించింది. మహా కూటమి చర్యలతో అసంతృప్తి చెందిన జేఎంఎం పార్టీ ఇకపై రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
మహా కూటమి తమ హక్కులను గౌరవించి, తమ భాగస్వామ్యాన్ని గౌరవించి ఉంటే, పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉండేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో తమకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కలిగే పరిణామాలను మహా కూటమి ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం బీహార్లో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జేఎంఎం సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి జేఎంఎంకు అన్యాయం చేశాయని విమర్శించారు. ఈ పరిణామాలకు జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తును పార్టీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు కచ్చితమైన సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు.
READ ALSO: Pakistan Earthquake 2025: పాకిస్థాన్లో 4.7 తీవ్రతతో భూకంపం.. దాయాది దేశానికి దెబ్బమీద దెబ్బ
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!