Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన జేఎంఎం పార్టీ తాజాగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
READ ALSO: Rashmika : బ్రేకప్ అయితే అమ్మాయిలు తట్టుకోలేరు.. రష్మిక కామెంట్స్
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
రాష్ట్రంలో కీలక పరిణామాలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరిది. నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ క్రమంలో JMM మహా కూటమిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కూటమిలో రాజకీయ అవకతవకలు జరిగాయని, ఫలితంగా తమ పార్టీ బీహార్ ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందని వెల్లడించింది. మహా కూటమి చర్యలతో అసంతృప్తి చెందిన జేఎంఎం పార్టీ ఇకపై రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
మహా కూటమి తమ హక్కులను గౌరవించి, తమ భాగస్వామ్యాన్ని గౌరవించి ఉంటే, పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉండేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో తమకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కలిగే పరిణామాలను మహా కూటమి ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం బీహార్లో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జేఎంఎం సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి జేఎంఎంకు అన్యాయం చేశాయని విమర్శించారు. ఈ పరిణామాలకు జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తును పార్టీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు కచ్చితమైన సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు.
READ ALSO: Pakistan Earthquake 2025: పాకిస్థాన్లో 4.7 తీవ్రతతో భూకంపం.. దాయాది దేశానికి దెబ్బమీద దెబ్బ
తాజావార్తలు
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
ట్రెండింగ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!