Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ రాజధాని పట్నా రోడ్లు మంగళవారం రణరంగాన్ని తలపించాయి. వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నివాసాన్ని ముట్టడించేందుకు దూసుకెళ్లారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించే 70వ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఈ ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో చారిత్రాత్మక గాంధీ మైదాన్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు ముఖ్యమంత్రి నివాసం వైపు దూసుకెళ్లకుండా పోలీసులు మార్గమంతటా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ, ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు వాటిని తోసుకుంటూ ముందుకు సాగారు. బారికేడ్లను బద్దలు కొట్టుకుని వస్తున్న అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పలుచోట్ల లాఠీఛార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనన్లను ప్రయోగించారు. అయినా సరే వెనక్కి తగ్గని విద్యార్థులు, పోలీసుల హెచ్చరికలను దాటుకుంటూ సీఎం నివాసానికి చేరువగా వెళ్లడం విశేషం.
నిజానికి పట్నాలోని గర్దానీబాగ్ ప్రాంతంలో పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు కొద్దిరోజులుగా నిరంతర నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారుల ప్రతినిధులతో ప్రభుత్వం సోమవారం జరిపిన చర్చలు సానుకూలంగానే ముగిసినప్పటికీ, తమ ప్రధాన డిమాండ్లు నెరవేరేవరకు వెనక్కి తగ్గేది లేదని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గాంధీ మైదాన్ నుంచి సీఎం నివాసానికి మార్చ్ను ప్రకటించి అమలు చేశారు. ప్రభుత్వం తరఫున కేవలం జూనియర్ అధికారులతో మాట్లాడించి విషయాన్ని దాటవేస్తున్నారని, ఈసారి నేరుగా ముఖ్యమంత్రే తమతో చర్చలు జరపాలని విద్యార్థి నేత సౌరవ్ కుమార్ స్పష్టం చేశారు. తమ తరఫున ఒక ప్రతినిధి బృందాన్ని సీఎం లేదా విద్యాశాఖ మంత్రి వద్దకు పంపడానికి సిద్ధంగా ఉన్నామని, వారిద్దరూ తప్ప వేరే ఏ అధికారితోనూ మాట్లాడేది లేదని, సీఎం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నిరసన విరమిస్తామని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు.
Also Read
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ఒకవైపు అభ్యర్థుల ఆందోళనలు ఉధృతంగా సాగుతుండగానే, మరోవైపు బీహార్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ‘విద్యార్థి సహయోగ్ శివిర్’ పేరిట ఒక నూతన కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రతి నెల నాలుగో మంగళవారం నాడు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సీఎం సమ్రాట్ చౌధరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా ‘1100’ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పటికీ, 70వ BPSC పరీక్ష అక్రమాలపై కచ్చితమైన చర్యలు తీసుకునేవరకు పోరాటాన్ని ఆపేది లేదని నిరుద్యోగ అభ్యర్థులు భీష్మించుకూర్చోవడంతో పట్నాలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్నెస్కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?