Shock To Tdp Leaders: అనుమతి లేకుండా స్టిక్కర్లు .. తాడపత్రిలో టీడీపీ నేతలకు చుక్కెదురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సీజన్ వచ్చేస్తోంది. ప్రతి పార్టీ జనంలోకి వెళ్లాలని భావిస్తోంది. ఒకవైపు అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల గురించి పీపుల్స్ సర్వే చేపడుతున్నారు. జగనన్నే మా భవిష్యత్ అంటూ ఇంటింటికీ, గడప గడపకూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈ మెగా మాస్ సర్వేకి అనూహ్య స్పందన లభించింది. ఇటు టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల దృష్టికి తెస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అంటూ సభలు పెడుతున్నారు. జగన్ స్టిక్కర్లను చూసి అదే తరహాలో ప్రచారానికి తెరతీశారు టీడీపీ నేతలు. అయితే అక్కడే రివర్స్ కొట్టింది వ్యవహారం. తాడిపత్రిలో జగన్ స్టిక్కర్ల తరహాలో టీడీపీ నేతలు స్టిక్కర్ల యుద్ధానికి దిగారు. అయితే వారికి స్థానికులు, ఇంటి యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అనుమతి లేకుండా స్టిక్కర్లు అంటించడంపై స్థానికుల నుంచి టీడీపీకి వ్యతిరేకత వచ్చింది. స్థానికులు ఆగ్రహించడంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గక తప్పలేదు.
Read Also: Ambati Rambabu: టీడీపీ పుట్టుక నుంచి కాపు వ్యతిరేక పార్టీయే
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం పెద్దపేట గ్రామంలో టీడీపీ ఇంచార్జి జేసీ అశ్మిత్ రెడ్డి ‘ఇదేం కర్మ మన రాష్ట్రం కి’ ప్రచారం నిర్వహించారు. టీడీపీ క్యాడర్ ఇంటి యజమానుల అనుమతి లేకుండా స్టిక్కర్ను అతికించడంతో ఓ ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు ఎవరిని అడిగి స్టిక్కర్లు అతికిస్తున్నారని యజమానులు మండిపడ్డారు. స్టిక్కర్లు అతికించవద్దని చెప్పినా జగన్ స్టిక్కర్ కింద అష్మిత్ రెడ్డి స్టిక్కర్ అతికించాడు టీడీపీ కార్యకర్త. దీంతో ఆగ్రహంతో టీడీపీ నేతలపై ఇంటి యజమానులు విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్త బలవంతంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే స్టిక్కర్ను తొలగించాల్సి వచ్చింది. తమ అనుమతి లేకుండా స్టిక్కర్లు ఎలా అతికిస్తారని, వెంటనే తీసేయాలని చెప్పడంతో టీడీపీ నేతలు ఆ స్టిక్కర్లు తీసేసి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!