Ashok Gehlot: కరోనా కాంగ్రెస్ పార్టీలోకి కూడా ప్రవేశించింది.. అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot: రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య రగులుతున్న రాజకీయ వివాదాల గురించి తెలిసిందే. ఈ గొడవల మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి తర్వాత పార్టీలో ‘పెద్ద కరోనా’ ప్రవేశించిందని ముఖ్యమంత్రి చెబుతున్న వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. అశోక్‌ గెహ్లాట్‌ సచిన్‌ పైలట్‌ను ఉద్దేశించి కరోనా వైరస్‌తో పోల్చినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నట్లు తెలిసింది. బుధవారం ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్ ప్రీ-బడ్జెట్ సమావేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Anurag Kashyap : పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయి.. మోడీ అప్పుడే చెబితే బాగుండు

×
×
Ad

సమావేశంలో పాల్గొన్నవారిలో ఒకరికి ప్రతిస్పందిస్తూ, ఎవరి పేరు చెప్పకుండానే గెహ్లాట్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద కరోనా ప్రవేశించిందన్నారు. ఉపఎన్నికలు వచ్చినా, రాజ్యసభ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం ఉద్యోగుల మద్దతుతో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిందన్నారు. అశోక్‌ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు సచిన్ పైలట్ తన ప్రభుత్వంపై పదేపదే చేసిన దాడికి కౌంటర్‌గా పరిగణించబడుతోంది. సోమవారం నుంచి వివిధ జిల్లాల్లో తన రోజువారీ బహిరంగ సభలలో, సచిన్‌ పైలట్ పేపర్ లీక్‌లు, పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టడం, రిటైర్డ్ బ్యూరోక్రాట్‌లకు రాజకీయ నియామకాలు వంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. 2018 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.