Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, పయ్యావుల కేశవ్ ములాఖత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కోర్టు తీర్పులు, లోకేష్ సిఐడి విచారణ, పార్టీ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించారు.
CID Investigation: కాసేపట్లో ముగియనున్న లోకేష్ సీఐడీ విచారణ
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
ములాఖత్ అనంతరం జైలు బయటకు వచ్చి అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబును చూసి బాధ కలిగిందన్నారు. కృష్ణా జలాలపై పార్టీ యంత్రాంగం స్లోగా ఉందని.. మీరందరూ చొరవ చూపకపోతే రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని.. ఈ కేసులను రాజకీయ కుట్రగా ప్రజలు భావిస్తున్నారని పయ్యావుల అన్నారు. ప్రజల కోసమే జైలులో ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తరుణంలో టీడీపీని ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారని.. జగన్ ప్రభుత్వ పతనం ఖాయమని ఆయన ఆరోపించారు.
Israel-Hamas: ఇజ్రాయిల్పై దాడిలో మా ప్రమేయం లేదు.. ఇరాన్ సుప్రీం లీడర్ కీలక వ్యాఖ్యలు..
ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీని దెబ్బతీయడానికి ఈ ప్రయత్నం చేసిందని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా 54 దేశాల్లో జనం ఆందోళన చేశారని.. చంద్రబాబు వెనకాల లక్షల మంది జనం ఉన్నారని తెలిపారు. అవినీతి జరగలేదు, కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జనం నమ్ముతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు…. ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని కేశవ్ తెలిపారు. నిక్కరేసుకున్న కుర్రోడు కూడా చెబుతాడు… కక్షపూరితంగా చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని అని అన్నారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ పై మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని… బాబు భద్రత వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని , కోర్టులను కోరుతామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!