Bhupesh Baghel: బీజేపీ పాలనలో పెద్ద కుంభకోణం.. 57 ఆత్మహత్యలపై ఇంకా విచారణ జరగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhupesh Baghel: రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ డైరెక్టర్కు తాను రాసిన రెండు లేఖలను ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు స్కామ్లపై దర్యాప్తు చేపట్టకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.చిన్న చిన్న విషయాలపై స్పందించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంతపెద్ద కుంభకోణంపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో సివిల్ సైప్లె కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే.. ఇప్పటివరకూ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) లేదా సివిల్ సప్లై కార్పొరేషన్ స్కామ్పై విచారణ కోరుతూ రాసిన లేఖలో, రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో అధికారులు దాడి చేసి నగదు, అసమానమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు భూపేష్ బఘేల్ చెప్పారు. కోట్లలో ఆస్తులున్నాయన్నారు. 28 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందికి కోర్టులో క్లీన్ చిట్ లభించిందని తెలిపారు. చిన్న విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకునే ఈడీ.. ఈ స్కామ్పై విచారణకు ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో నాగ్రిక్ అపూర్తి నిగమ్ స్కామ్కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే ఇప్పటివరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. 15 రోజులలోపు ఈడీ ఎటువంటి చర్య తీసుకోకపోతే, కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలకు సంబంధించి మరో లేఖలో, 2009- 2017 మధ్య, అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో చిట్ ఫండ్ కంపెనీల ఉపాధి మేళాలను నిర్వహించిందని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. చిత్తశుద్ధి లేని చిట్ ఫండ్ సంస్థలు ఇలాంటి మేళాల ద్వారా యువకులను, అమాయక ప్రజలను మోసం చేసి అనేక కోట్ల రూపాయలను దండుకున్నాయని ఆయన పేర్కొన్నారు.2010- 2016 మధ్య ఈ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, వాటిలో కొన్ని కార్యాలయాలు కూడా సీలు చేయబడ్డాయి, అయితే తరువాత వాటిని గత బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్వహించడానికి అనుమతించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
161 కంపెనీలపై 310 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా వాటి నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేదు. అలాంటి కంపెనీలకు చెందిన 57 మంది ఏజెంట్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, కొందరు హత్యకు గురయ్యారని, అయితే అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. రాజ్నంద్గావ్, సుర్గుజాలో (2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత) కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఇందులో బీజేపీ మాజీ ఎంపీలు అభిషేక్ సింగ్, మధుసూదన్ యాదవ్, బీజేపీ రాజ్నంద్గావ్ జిల్లా యూనిట్ చీఫ్, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు, పెట్టుబడిదారుల నుండి 25 లక్షల దరఖాస్తులు అందాయని (వారి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతూ) ఈ కుంభకోణం సుమారు రూ. 6,500 కోట్లు అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!