Bhupesh Baghel: బీజేపీ పాలనలో పెద్ద కుంభకోణం.. 57 ఆత్మహత్యలపై ఇంకా విచారణ జరగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhupesh Baghel: రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ డైరెక్టర్కు తాను రాసిన రెండు లేఖలను ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు స్కామ్లపై దర్యాప్తు చేపట్టకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.చిన్న చిన్న విషయాలపై స్పందించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంతపెద్ద కుంభకోణంపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో సివిల్ సైప్లె కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే.. ఇప్పటివరకూ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) లేదా సివిల్ సప్లై కార్పొరేషన్ స్కామ్పై విచారణ కోరుతూ రాసిన లేఖలో, రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో అధికారులు దాడి చేసి నగదు, అసమానమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు భూపేష్ బఘేల్ చెప్పారు. కోట్లలో ఆస్తులున్నాయన్నారు. 28 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందికి కోర్టులో క్లీన్ చిట్ లభించిందని తెలిపారు. చిన్న విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకునే ఈడీ.. ఈ స్కామ్పై విచారణకు ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో నాగ్రిక్ అపూర్తి నిగమ్ స్కామ్కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే ఇప్పటివరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. 15 రోజులలోపు ఈడీ ఎటువంటి చర్య తీసుకోకపోతే, కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలకు సంబంధించి మరో లేఖలో, 2009- 2017 మధ్య, అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో చిట్ ఫండ్ కంపెనీల ఉపాధి మేళాలను నిర్వహించిందని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. చిత్తశుద్ధి లేని చిట్ ఫండ్ సంస్థలు ఇలాంటి మేళాల ద్వారా యువకులను, అమాయక ప్రజలను మోసం చేసి అనేక కోట్ల రూపాయలను దండుకున్నాయని ఆయన పేర్కొన్నారు.2010- 2016 మధ్య ఈ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, వాటిలో కొన్ని కార్యాలయాలు కూడా సీలు చేయబడ్డాయి, అయితే తరువాత వాటిని గత బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్వహించడానికి అనుమతించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
161 కంపెనీలపై 310 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా వాటి నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేదు. అలాంటి కంపెనీలకు చెందిన 57 మంది ఏజెంట్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, కొందరు హత్యకు గురయ్యారని, అయితే అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. రాజ్నంద్గావ్, సుర్గుజాలో (2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత) కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఇందులో బీజేపీ మాజీ ఎంపీలు అభిషేక్ సింగ్, మధుసూదన్ యాదవ్, బీజేపీ రాజ్నంద్గావ్ జిల్లా యూనిట్ చీఫ్, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు, పెట్టుబడిదారుల నుండి 25 లక్షల దరఖాస్తులు అందాయని (వారి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతూ) ఈ కుంభకోణం సుమారు రూ. 6,500 కోట్లు అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!