Bhupesh Baghel: బీజేపీ పాలనలో పెద్ద కుంభకోణం.. 57 ఆత్మహత్యలపై ఇంకా విచారణ జరగలేదు..
Bhupesh Baghel: రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ రాశారు. ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ డైరెక్టర్కు తాను రాసిన రెండు లేఖలను ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు స్కామ్లపై దర్యాప్తు చేపట్టకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.చిన్న చిన్న విషయాలపై స్పందించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంతపెద్ద కుంభకోణంపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో సివిల్ సైప్లె కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే.. ఇప్పటివరకూ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) లేదా సివిల్ సప్లై కార్పొరేషన్ స్కామ్పై విచారణ కోరుతూ రాసిన లేఖలో, రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో అధికారులు దాడి చేసి నగదు, అసమానమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు భూపేష్ బఘేల్ చెప్పారు. కోట్లలో ఆస్తులున్నాయన్నారు. 28 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందికి కోర్టులో క్లీన్ చిట్ లభించిందని తెలిపారు. చిన్న విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకునే ఈడీ.. ఈ స్కామ్పై విచారణకు ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో నాగ్రిక్ అపూర్తి నిగమ్ స్కామ్కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే ఇప్పటివరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. 15 రోజులలోపు ఈడీ ఎటువంటి చర్య తీసుకోకపోతే, కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలకు సంబంధించి మరో లేఖలో, 2009- 2017 మధ్య, అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో చిట్ ఫండ్ కంపెనీల ఉపాధి మేళాలను నిర్వహించిందని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. చిత్తశుద్ధి లేని చిట్ ఫండ్ సంస్థలు ఇలాంటి మేళాల ద్వారా యువకులను, అమాయక ప్రజలను మోసం చేసి అనేక కోట్ల రూపాయలను దండుకున్నాయని ఆయన పేర్కొన్నారు.2010- 2016 మధ్య ఈ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, వాటిలో కొన్ని కార్యాలయాలు కూడా సీలు చేయబడ్డాయి, అయితే తరువాత వాటిని గత బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్వహించడానికి అనుమతించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Also Read
- Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Dharmapuri Arvind: పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే.. పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితది
Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
161 కంపెనీలపై 310 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా వాటి నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేదు. అలాంటి కంపెనీలకు చెందిన 57 మంది ఏజెంట్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, కొందరు హత్యకు గురయ్యారని, అయితే అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. రాజ్నంద్గావ్, సుర్గుజాలో (2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత) కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఇందులో బీజేపీ మాజీ ఎంపీలు అభిషేక్ సింగ్, మధుసూదన్ యాదవ్, బీజేపీ రాజ్నంద్గావ్ జిల్లా యూనిట్ చీఫ్, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు, పెట్టుబడిదారుల నుండి 25 లక్షల దరఖాస్తులు అందాయని (వారి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతూ) ఈ కుంభకోణం సుమారు రూ. 6,500 కోట్లు అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
-
Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
-
Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
-
Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!