Jayashankar Bhupalpally: ఆఫీసుకు రాలేదని ఆబ్సెంట్.. అధికారిపై చేయిచేసుకున్న ఉద్యోగి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కార్యాలయానికి సహ ఉద్యోగి రాకపోవడంతో ఆబ్సంట్ వేసిన ఉన్నతాధికారిపై చేయిచేసుకున్న ఘటన సంచనంగా మారింది. అయితే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండటం గమనార్హం.
అయితే.. ఈనెల 17,18న ఎలాంటి సమాచారం లేకుండా విధులకు ఏడీఏ శ్రీధర్ హాజరు కాలేదు. దీంతో పై అధికారి డీఏఓ విజయ్భాస్కర్.. శ్రీధర్ గురించి ఆరా తీయగా సహ ఉద్యోగులు తెలియదు అంటూ సమాధానం చెప్పారు. ఈనేపథ్యంలో డీఏఓ విజయ్ .. శ్రీధర్ ఆ రెండు రోజులు ఆబ్సెంట్ వేశాడు. అయితే శ్రీధర్ నిన్న (శుక్రవారం) విధులకు హాజరయ్యాడు. రోజూలేగానే రిజిస్టార్ లో సైన్ పెట్టేందుకు వెళ్లాడు. అయితే 17,18న తనకు ఆబ్సెంట్ వేసింది కనిపించింది. దీంతో రగిలిపోయిన శ్రీధర్ నాకు ఎవరు ఆబ్సెంట్ వేసింది అంటూ ప్రశ్నించారు. డీఏఓ విజయ్ అని చెప్పడంతో కోపంతో శ్రీధర్ ఆయన దగ్గరకు వెళ్లాడు. నాకే ఆబ్సెంట్ వేస్తావా అంటూ నీ అంతు చూస్తా అంటూ దాడి చేశాడు. అంతేకాకుండా డీఏఓ విజయ్ పై చేయిచేసుకున్నాడు. సహ ఉద్యోగులు శ్రీధర్ ను బయటకు లాక్కుని వచ్చారు. దీంతో గొడవ కాస్త తగ్గినా శ్రీధర్ మాత్రం విజయ్ పై కోపంతో నీ అంతు చూస్తా అంటూ బెదిరించాడని తోటి ఉద్యోగులు తెలిపారు.
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
Read also: Train derail: కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్-అలప్పుజ ఎక్స్ప్రెస్ ట్రైన్..
అయితే డీఏఓ విజయ్ మాట్లాడుతూ.. ఏడీఏ ఎలాంటి సమాచారం లేకుండా, లీవ్ పెట్టకుండా.. ఆఫీసుకు హాజరుకాకపోతే ఆబ్సెంట్ వేసే అధికారం తనకు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా.. తన ఛాంబర్లోకి వచ్చి ఒక్కసారిగా చేయి చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తెలిపారు. ఏడీఏపై కలెక్టర్కు ఫిర్యాదు చేయగా సరెండర్ చేయమని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. శ్రీధర్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనున్నట్లు తెలిపారు. అయితే మరోవైపు దాడి విషయమై ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ తాను సెలవు పెట్టానని, ఆ లేఖను ఆఫీసులో ఇచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా.. డీఏఓను తాను కొట్టలేదని తెలిపాడు. డీఏఓ తనపై దుర్భాషలాడారని చెప్పారు. తనపై డీఏఓ కు కక్ష ఉందని.. అది సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు వెల్లడించారు.
North korean : వీడియో చూసినందుకు 12ఏళ్ల జైలు శిక్ష
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!