బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవలే ఈ భామ ది లేడీ కిల్లర్ అనే క్రైమ్ థ్రిల్లర్తో అభిమానులను ఎంతగానో అలరించింది. అలాగే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అనే అడల్ట్ మూవీ తర్వాత ఈ భామ అర్జున్ కపూర్ సరసన నటించింది.ఈ చిత్రానికి అజయ్ బహల్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 3న రిలీజైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ జంటగా మేరీ పట్నీ కా రీమేక్ అనే మరో మూవీ లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే భూమి పెడ్నేకర్ ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది.. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుంది.
డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యం అంతా బాగుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అంతే కాకుండా దోమల నివారణ తప్పనిసరి అని ఆమె తెలియజేసింది.. అధిక కాలుష్యం కూడా మన అనారోగ్యానికి ఒక కారణమని భూమి ఫెడ్నేకర్ పేర్కొంది.భూమి ఇన్స్టాలో రాస్తూ.. “ఒక దోమ వల్ల నేను 8 రోజులు నరకం అనుభవించాను . దాదాపు వారం రోజుల తర్వాత నేను ఉదయాన్నే నిద్ర లేచా. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కొన్ని రోజులుగా నా కుటుంబానికి దూరంగా ఉండడం ఎంతో కష్టంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ దోమలను చంపే వాటిని వినియోగించడం తప్పనిసరి. అలాగే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోండి. అధిక కాలుష్యంతో మన రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గుతోంది. నాకు తెలిసిన చాలా మందికి కూడా డెంగ్యూ వచ్చింది. నన్ను బాగా చూసుకున్నందుకు ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
