Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే
Bhoot Jolokia : ఎర్ర మిరపకాయలు ఆహారంలో ఘాటు కోసం వాడుతుంటాం.. కూరలలో కారం వేయడం వల్ల దాని రుచి పెరుగుతుంది. దీనితో పాటు కూర రంగు కూడా ఎర్రగా మారుతుంది. భారతదేశం అంతటా ఎర్ర మిరప విరివిగా సాగు చేస్తారు. కానీ నాగాలాండ్ భూత్ జోలోకియాలో పండే ఎర్ర మిరపకాయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హాట్ చిల్లీ హాపెన్స్లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయింది. భూట్ జోలోకియా ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ. దీనినే ఘోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికన్ రెడ్ సవినా కంటే రెట్టింపు కారం ఉంటుంది. ఇది మామూలు మిర్చి కారపు పొడి కంటే మూడు రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది.
Read Also: Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
భూత్ జోలోకియా నాగాలాండ్లోని ప్రసిద్ధ ఎర్ర మిరప. ఇది విత్తిన 75 నుండి 90 రోజుల తర్వాత మాత్రమే పంట చేతికి వస్తుంది. భుట్ జోలోకియా మిరపకాయ చెట్టు ఎత్తు 50 నుండి 120 సెం.మీ వరకు ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయలు సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటాయి. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది, వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.
ఈ మిరపకాయను పెప్పర్ స్ప్రే తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ స్ప్రేతో మహిళలు తమను తాము రక్షించుకుంటారు. పెప్పర్ స్ప్రేని పిచికారీ చేసినప్పుడు, ప్రజల గొంతు, కళ్ళలో మంట మొదలవుతుంది. 2007లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. నాగాలాండ్లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. కావాలంటే ఇంటి లోపల కుండీలో కూడా పెంచుకోవచ్చు.
Read Also: Save The Tigers: పిల్లిగా మారిన పులి లాంటి భర్తల కథ!
2008 సంవత్సరంలో భూత్ జోలోకియా GI ట్యాగ్ని పొందింది. GI టాక్ అనేది భౌగోళిక సూచన. GI ట్యాగ్ ద్వారా కస్టమర్ తాను కొనుగోలు చేస్తున్న వస్తువు ఏ ప్రదేశం నుండి సంబంధించినదో తెలుసుకుంటారు. GI ట్యాగ్ పొందడమంటే ఆ వస్తువు బ్రాండ్ విలువ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పంటను సాగుచేసిన రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు.. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయకు యూరప్లో కూడా చాలా డిమాండ్ ఉంది. 2021లో జోలోకియా మిర్చి లండన్కు ఎగుమతి చేయబడింది. భూత్ జోలోకియా పంట ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదు. భారీ వర్షాలు కురిస్తే అది చెడిపోతుంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో