Bhoot Jolokia : ఘోస్ట్ పెప్పర్.. ఒక్కటంటే ఒక్క మిర్చి నమిలారో ఇక అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhoot Jolokia : ఎర్ర మిరపకాయలు ఆహారంలో ఘాటు కోసం వాడుతుంటాం.. కూరలలో కారం వేయడం వల్ల దాని రుచి పెరుగుతుంది. దీనితో పాటు కూర రంగు కూడా ఎర్రగా మారుతుంది. భారతదేశం అంతటా ఎర్ర మిరప విరివిగా సాగు చేస్తారు. కానీ నాగాలాండ్ భూత్ జోలోకియాలో పండే ఎర్ర మిరపకాయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హాట్ చిల్లీ హాపెన్స్లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయింది. భూట్ జోలోకియా ఇది ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయ. దీనినే ఘోస్ట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. ఇది మెక్సికన్ రెడ్ సవినా కంటే రెట్టింపు కారం ఉంటుంది. ఇది మామూలు మిర్చి కారపు పొడి కంటే మూడు రెట్లు ఎక్కువ కారంగా ఉంటుంది.
Read Also: Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
భూత్ జోలోకియా నాగాలాండ్లోని ప్రసిద్ధ ఎర్ర మిరప. ఇది విత్తిన 75 నుండి 90 రోజుల తర్వాత మాత్రమే పంట చేతికి వస్తుంది. భుట్ జోలోకియా మిరపకాయ చెట్టు ఎత్తు 50 నుండి 120 సెం.మీ వరకు ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయలు సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటాయి. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది, వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.
ఈ మిరపకాయను పెప్పర్ స్ప్రే తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ స్ప్రేతో మహిళలు తమను తాము రక్షించుకుంటారు. పెప్పర్ స్ప్రేని పిచికారీ చేసినప్పుడు, ప్రజల గొంతు, కళ్ళలో మంట మొదలవుతుంది. 2007లో భూత్ జోలోకియా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. నాగాలాండ్లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. కావాలంటే ఇంటి లోపల కుండీలో కూడా పెంచుకోవచ్చు.
Read Also: Save The Tigers: పిల్లిగా మారిన పులి లాంటి భర్తల కథ!
2008 సంవత్సరంలో భూత్ జోలోకియా GI ట్యాగ్ని పొందింది. GI టాక్ అనేది భౌగోళిక సూచన. GI ట్యాగ్ ద్వారా కస్టమర్ తాను కొనుగోలు చేస్తున్న వస్తువు ఏ ప్రదేశం నుండి సంబంధించినదో తెలుసుకుంటారు. GI ట్యాగ్ పొందడమంటే ఆ వస్తువు బ్రాండ్ విలువ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఆ పంటను సాగుచేసిన రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే డిమాండ్ పెరిగినప్పుడు.. రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేస్తారు. భూట్ జోలోకియా మిరపకాయకు యూరప్లో కూడా చాలా డిమాండ్ ఉంది. 2021లో జోలోకియా మిర్చి లండన్కు ఎగుమతి చేయబడింది. భూత్ జోలోకియా పంట ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేదు. భారీ వర్షాలు కురిస్తే అది చెడిపోతుంది.
తాజావార్తలు
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?