Dharmasthala case: భీమా పచ్చి అబద్ధాలకోరు.. మాజీ భార్య తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmasthala case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో చెన్నయ్య అలియాస్ భీమాపై ఆయన మాజీ భార్య రత్నమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మస్థలలో తాను పెద్ద సంఖ్యలో మహిళల శవాలు పాతినట్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హడలెత్తించిన భీమ ఆరోపణల్లో నిజం లేదని సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. మాండ్యా జిల్లాలో చిక్కబళ్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది. తాజాగా అతడి మాజీ భార్య రత్నమ్మ మీడియా ఎదుటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నయ్య తనతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ అత్యాచారాలు, హత్యలు, సామూహిక ఖననాల ఘటనల గురించి చెప్పలేదని రత్నమ్మ వెల్లడించింది. డబ్బు కోసమే అతడు ధర్మస్థలలో వివాదం సృష్టించి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
READ ALSO: Rahul Gandhi: ఈసీకి బీజేపీతో పొత్తు ఉంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
నిరుద్యోగిని అని అబద్ధాలు చెప్పాడు..
నాగమంగళలో సివిక్ వర్కర్గా పనిచేసిన రత్నమ్మ భీమాను 1999లో పెళ్లి చేసుకొంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో వారు విడిపోయారు. ఈసందర్భంగా రత్నమ్మ మాట్లాడుతూ.. చెన్నయ్య అలియాస్ భీమా తనను తీవ్రంగా కొట్టేవాడని పేర్కొంది. విడాకుల సమయంలో కోర్టులో నిరుద్యోగిని అని అబద్ధాలు చెప్పి, తనకు భరణం ఎగ్గొట్టాడని చెప్పింది. దీంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, కొన్నాళ్ల పాటు తనను తల్లి చూసుకొందని, ఆ తర్వాత బిడ్డల అండతో జీవిస్తున్నట్లు పేర్కొంది.
భీమా ధర్మస్థలలో ఉండగా మొత్తం మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకొన్నాడని, అందరి నుంచి విడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన 2014లో ధర్మస్థల నుంచి ఓ మహిళతో కలిసి స్వగ్రామానికి వెళ్లి ఆమెను తన భార్యగా ఊళ్లోని వారికి చెప్పాడని అన్నారు. చిక్కబళ్లికి చెందిన బాలు అనే వ్యక్తి మాట్లాడుతూ.. భీమా డబ్బుకోసం ఏమైనా చేస్తాడని ఆరోపించాడు. చిన్నయ్య మూడో తరగతి వరకు ఇదే గ్రామంలో చదువుకున్నాడని, తర్వాత బడి మానేసి జులాయిగా తిరిగేవాడని అన్నారు. చిన్న వయసులోనే తనకు వివాహమైందని, ధర్మస్థలకు మొదట అతడి సోదరుడు తన్యాసి వెళ్లి పనిలో చేరాడని చెప్పారు. తర్వాత చిన్నయ్య 1994లో పనికి వెళ్లేవాడని అన్నారు. 2024 ఆయన గ్రామ పంచాయతీ స్థలాన్ని తనపేరు మీద రాసి ఇవ్వాలని సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడని ఆ గ్రామ ప్రజలు ‘సిట్ అధికారులకు చెప్పారు.
READ ALSO: Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?