Hijab : గుజరాత్లో హిజాబ్ వివాదం.. ప్రిన్సిపాల్ పై విద్యాశాఖ చర్య
Hijab : గుజరాత్లో బోర్డు పరీక్షల సందర్భంగా హిజాబ్పై వివాదం నెలకొంది. భరూచ్ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఒక పాఠశాల ప్రిన్సిపాల్ బోర్డ్ పరీక్షల సమయంలో ముస్లిం బాలికల హిజాబ్ను తొలగించేలా చేశాడు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ని పరీక్షల నిర్వాహకుడి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాలికలు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాష్ట్ర విద్యా శాఖ పరీక్షా కేంద్రం నిర్వాహకుడు ఇసాబెల్ సుర్టియా (ప్రిన్సిపాల్)ని తొలగించే చర్యను తక్షణమే అమలులోకి తెచ్చింది.
విద్యార్థినుల హిజాబ్ను తొలగించిన ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ సంఘటన గుజరాత్లోని భరూచ్లోని లయన్స్ స్కూల్ అంకలేశ్వర్లో జరిగింది. గుజరాత్ బోర్డు 10-12వ తరగతి పరీక్షలు బుధవారం జరిగాయి. 10వ తరగతి గణితం పేపర్ను నిర్వహించారు. బోర్డు పరీక్ష ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు పరీక్ష హాల్కు చేరుకున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఆమె హిజాబ్ ధరించింది. ప్రిన్సిపాల్ ఆమెను హిజాబ్ విప్పమని అడిగాడు.
Also Read
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
Read Also:PM Modi: వచ్చే వారం భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్రమోడీ..
అంతే కాకుండా, హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించిన బాలికలందరికీ కూడా అదే చెప్పారు. బాలికలందరి హిజాబ్, స్కార్ఫ్ను తొలగించారు. పరీక్షకు కొద్ది నిమిషాల ముందు ప్రిన్సిపల్ తీరుతో పరీక్ష హాలుకు వచ్చిన విద్యార్థుల్లో మనోధైర్యం తగ్గిపోయిందని ఫిర్యాదుదారు విద్యార్థి అంటున్నారు. దీంతో తమ పేపర్ కూడా చెడిపోయిందని పలువురు విద్యార్థినులు తెలిపారు. హిజాబ్ను తొలగించాలని విద్యా బోర్డు అధికారి నుండి తనకు ఆదేశాలు అందాయని ప్రిన్సిపాల్ చెప్పినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో అందరూ కలిసి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బోర్డు పరీక్షల సమయంలో ఇలాంటివి జరగకూడదని, విద్యార్థులు బాగా పరీక్ష రాయగలరని అన్నారు. బాలికలు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాష్ట్ర విద్యా శాఖ ఇప్పుడు పరీక్షా కేంద్రం నిర్వాహకుడు ఇసాబెల్ సురతియా (ప్రిన్సిపాల్) ను పరీక్ష నిర్వాహకుడి పదవి నుండి తక్షణమే అమలులోకి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజీని నేనే స్వయంగా చూశానని జిల్లా విద్యాశాఖాధికారి స్వాతి రావల్ తెలిపారు. ఈ చర్య కోసం ప్రిన్సిపాల్ను పరీక్ష నిర్వాహకుడి పదవి నుండి తక్షణమే తొలగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
Read Also:BJP-SAD alliance: బీజేపీకి గట్టి షాక్.. పొత్తు లేదని తేల్చి చెప్పిన సుఖ్బీర్ సింగ్
తాజావార్తలు
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!