IND vs NZ: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు కష్టమే!
- అక్టోబర్ 16న తొలి టెస్టు ప్రారంభం
- ఫేవరెట్గా బరిలోకి భారత్
- ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Weather Report: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అక్టోబర్ 16న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ను 2-0తో వైట్వాష్ చేసిన రోహిత్ సేన.. న్యూజిలాండ్ను కూడా మట్టికరిపించాలని చూస్తోంది. చరిత్ర చూసినా, ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసినా.. భారత్ తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. గత కొన్నేళ్లుగా సొంతగడ్డపై భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన కివీస్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
అయితే తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. బెంగళూరు నగరంలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అక్కడ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం నుంచి బెంగళూరులో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం అయితే కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందట. మ్యాచ్ మొదటి రెండు రోజుల్లో 40 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మూడో రోజు 67 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
Also Read: IPL 2025 Auction: రోహిత్ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది కాబట్టి.. మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వర్షం ఆగిన 40 నిమిషాల్లో మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. భారత్లో ఈ మైదానమే బెస్ట్ డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఇది అభిమానులకు ఊరట కలిగించే విషయమే. చూడాలి మరి వరణుడు ఏం చేస్తాడో. భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదు. ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా.. భారత్ 22, న్యూజిలాండ్ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!