Bengaluru: మరింత నీటి సంక్షోభం దిశగా బెంగళూరు
బెంగళూరులో నీటి సంక్షోభం మరింత ముదిరింది. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులైతే గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకక బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు విపరీతమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లభించక విలవిలలాడుతున్నారు. గత రెండు నెలలగా అవస్థలు పడుతున్న జనాలు.. ఇప్పుడు ఆ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవాలంటూ దేవునికి మొక్కుతున్నారు.
బెంగళూరులో నీటి బావులు, బోర్లు, కాలువలు అన్ని ఎండిపోయాయి. దీంతో చుక్క నీరు కోసం కష్టపడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిన కొన్ని నీళ్లతోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ చేసుకుని వాడుకుంటున్నారు. నీటి ట్యాంకర్లు కూడా సరిగ్గా దొరకడం లేదు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు ట్యాంకర్లు అవసరం ఉన్న చోట కేవలం ఒక ట్యాంకరే వస్తోంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక వాసి వాపోయాడు. పైగా ట్యాంకర్లు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
రుతుపవనాలు త్వరగా వస్తే మంచి రోజులు వస్తాయని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని ప్రజలు మండిపడుతున్నారు. తాగునీటి కోసం కిలోమీటరు పొడవునా క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని.. గత నెల రోజుల్లో 5 సార్లు మాత్రమే స్నానం చేసినట్లు ప్రజలు వాపోయారు.
బెంగళూరు ప్రధానంగా కావేరి నది.. భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే మురుగునీటిని శుద్ధి కర్మాగారాల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తారు. కానీ గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో నీటి లభ్యత తగ్గిపోయింది. ఇలా రెండు నెలలుగా అవస్థలు పడుతున్నారు. బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం సగం కూడా దొరకడం లేదు. దీంతో నగరవాసులు రోజు నీళ్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక నివాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు అక్రమార్జనకు తెరలేపాయి. ట్యాంకర్లకు అధికారులు ధరలను నిర్ణయించారు. అయినా కూడా ఎక్కడా అమలు కావడం లేదు. ఇక వాహనాలను శుభ్రపరచడానికి.. వ్యవసాయం, నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని ప్రకటించారు. ఇక ఆస్పత్రుల్లో అయితే పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే నీటి సంక్షోభం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నీటి ఎద్దడికి మీరు కారణమంటే.. మీరు కారణమంటూ కాంగ్రెస్-బీజేపీలు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. మరీ ఇప్పుడే ఇంత దారుణంగా నీటి సంక్షోభం ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో