Telia Bhola Fish: రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telia Bhola Fish: ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం చేపలకు చాలా ఫేమస్. దేశంలో ఎక్కువ చేపలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ చాలా మంది చేపల వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు. వీరిలో కొంతమంది వలలో కొన్ని ఖరీదైన చేపలు పడి రాత్రికి రాత్రే వారి జీవితాన్ని మార్చేస్తాయి. తాజాగా మళ్లీ అలానే వెస్ట్ బెంగాల్ లోని కొంతమంది జాలర్ల జీవితం మారిపోయింది.
Also Read: Sunday: ఆదివారం పుట్టిన వారి లక్షణాలు.. ఆ ఒక్కటే వారిలో మైనస్
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
సాధారణంగా ప్రతి ఏడాది హిల్సా(పులసచేపలు) చేపల ఉత్పత్తిపైనే వారి ఆదాయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్ వేలం కేంద్రంలో ఏటా హిల్సా చేపల వేలం జోరుగా సాగుతుంది. ఇది తూర్పు భారతదేశంలో అతిపెద్ద సముద్రపు చేపల వేలం కేంద్రం. ఇక్కడి నుంచే విదేశాలకు చేపలను ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది సరిగ్గా హిల్సా చేపలు వచ్చే సమయంలో వేడి వర్షాలు కురవడంతో వాటి ఉత్పత్తి ఘణనీయంగా తగ్గింది. దీంతో మత్స్యకారుల ఆదాయానికి గండిపడింది. దిగాలుగా ఉన్న వారిని అనుకోని అదృష్టం వరించింది.
“తెలియా భోలా” చేపల రూపంలో వారి కష్టం తీరింది. లక్షల విలువ చేసే ఈ చేపలు మొత్తం 9 మత్స్యకారులకు లభించాయి. వీటి రేటు వింటే అవాక్కావ్వాల్సిందే. కేజీ రూ.31 వేలు వరకు ఉంటుంది. ఒక్కో చేప బరువు దాదాపు 25-30 కేజీలు ఉంటుంది. అంటే వీటి ధర కొన్ని లక్షల్లో ఉంటుంది. వీటికి ఎంత గిరాకీ ఉంటుందంటే జాలర్లు తెచ్చిన రోజే మొత్తం చేపలు అమ్ముడైపోయాయి. వీటిని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ చేపలోని కొన్ని భాగాలను మందుల తయారీలో ఉపయోగిస్తారు.ఈ చేప పేగులను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ప్రపంచ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి సాధారణంగా దొరకవు ఎందుకంటే సముద్రంలో లోపల ఇవి జీవిస్తూ ఉంటాయి. ఇక హిల్సా చేపలు దొరకక సతమతమవుతున్న జాలర్లకు తెలియా భోలా చేపల రూపంలో ఈ ఏడాది కలిసొచ్చిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!