Tanmoy Bhattacharya: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే!.. సస్పెండ్ చేసిన సీపీఎం
- మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు
- సస్పెండ్ చేసిన సీపీఎం పార్టీ
- పార్టీ అంతర్గత విచారణ జరుపుతుందని సీపీఎ రాష్ట్ర కార్యదర్శి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tanmoy Bhattacharya: పశ్చిమ బెంగాల్లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించింది. తన్మయ్ భట్టాచార్యపై వచ్చిన ఆరోపణలపై పార్టీ అంతర్గత విచారణ జరుపుతుందని సీపీఎ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తెలిపారు. విచారణ జరిగే వరకు తన్మయ్ భట్టాచార్య సస్పెండ్లో ఉంటారు. విచారణ కమిటీ ఇచ్చే ప్రతిపాదన మేరకు చర్యలు తీసుకుంటామని సలీం తెలిపారు. సీపీఎం నాయకుడు తన ఒడిలో కూర్చున్నప్పుడు ఉదయం తన్మయ్ భట్టాచార్యను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లానని ఓ మహిళా జర్నలిస్ట్ ఆదివారం మధ్యాహ్నం ఫేస్బుక్ లైవ్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫేస్బుక్ లైవ్ మధ్యాహ్నం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సీపీఎంలో కలకలం రేగింది.
Read Also: Google Photos: గూగుల్ ఫొటోస్లో కొత్త ఫీచర్.. ఇక ఆ సమస్యకు చెక్!
Also Read
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
అనంతరం మహ్మద్ సలీం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మధ్యాహ్నం తెలిసింది. తన్మయ్ భట్టాచార్య తీరుపై ఓ మహిళా జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ టచ్ నార్మల్, ఏది బ్యాడ్ టచ్ అని అమ్మాయిలు బాగా అర్థం చేసుకుంటారు. పార్టీగా, సీపీఎం అటువంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. తన్మయ్ భట్టాచార్య ఏదైనా తప్పు చేసి ఉంటే సీపీఎం పార్టీ ఏ విధంగానూ మద్దతు ఇవ్వదని సలీం తెలిపారు. అతడి వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గతంగా దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.
తన్మయ్ భట్టాచార్య గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు..
తన్మయ్ భట్టాచార్య సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తన్మయ్ భట్టాచార్య 2016 నుండి 2021 వరకు నార్త్ డమ్డమ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2021లో చంద్రిమా భట్టాచార్య చేతిలో తన్మయ్ భట్టాచార్య ఓడిపోయారు. ఇటీవల బరాహ్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన్మయ్ ఓడిపోయారు. తన్మయ్ భట్టాచార్య గతంలో పార్టీతో అనుబంధం, పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, కాంగ్రెస్ ఊరేగింపులకు వెళ్లడంపై పార్టీలో వివాదాల్లో చిక్కుకున్నారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాం..
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!