Beekeeping: తేనేటీగల పెంపకం వల్ల లాభాలు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది.. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు తేనెటీగల పెంపకం కూడా చేపట్టాలి. అందరికీ ఈఅవకాశం లేకపోయినా ప్రతి గ్రామంలో పంటలు సాగు చేసే ప్రాంతాల్లో మాత్రం తేనె పరిశ్రమ నడిపించవచ్చంటున్నారు నిపుణులు.. మరి ఆలస్యం ఎందుకు తేనేటీగల పెంపకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచింది. పలు రంగాలకు సంబంధించి ఈపథకాలు అమలులో ఉన్నాయి. వీటిల్లో జాతీయ తేనెటీగల పెంపకం , తేనె మిషన్ కూడా ఒకటి. 2020లో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.ఒక్క రైతులు మాత్రమే కాదు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ మిషన్ ద్వారా సాయం అందుకుని తేనె పరిశ్రమను నడిపించవచ్చంటున్నారు అధికారులు.. అదే విధంగా తేనెటీగల పెంపకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం, తేనె, ఇతర తేనె ఉత్పత్తుల మూలాన్ని గుర్తించడం కోసం బ్లాక్చెయిన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తేనె కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిలో అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, అగ్రి-స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, తేనెటీగల పెంపకందారుల మధ్య వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నారు.. స్వయం ఉపాధి కింద ఈ పెంపకం చేపట్టడానికి ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది..
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
తేనెటీగల పెంపకం అనేది రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. తేనెటీగల పెంపకం యొక్క ప్రయోజనాలు అనేకం. పరపరాగ సంపర్కం ద్వారా పండ్లు, కూరగాయలు, నూనెగింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం పెరుగుతుంది. పర్యావరణం, వ్యవసాయం రంగంలో స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇకపోతే తేనేటీగల పెంపకం చేపట్టేవాళ్ళు ముందుగా హైదరాబాద్ లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. అప్పుడే వాటి పెంపకం పై అవగాహన పెరుగుతుంది.. అలాగే ఆదాయం పెరుగుతుంది..
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!