Beekeeping: తేనేటీగల పెంపకం వల్ల లాభాలు వస్తాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశం అంటే రైతన్నలు ఉన్న పుణ్య దేశం అంటారు పెద్దలు.. వ్యవసాయం చేస్తూ నలుగురికి కడుపు నింపుతున్నారు.. ఒక్క పంటలు పండించడం ఒక్కటే అనేక రకాలుగా చేస్తున్నారు. అందులో ఒక్కటి తేనేటీగల పెంపకం.. తేనేకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో తేనె పరిశ్రమ చాలా ముఖ్యమైంది. రైతులు కేవలం పంటల సాగుపై ఆధారపడితే వరదలు, కరువు కాటకాలతో నష్టపోయే ప్రమాదం ఉంది.. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోడితో పాటు తేనెటీగల పెంపకం కూడా చేపట్టాలి. అందరికీ ఈఅవకాశం లేకపోయినా ప్రతి గ్రామంలో పంటలు సాగు చేసే ప్రాంతాల్లో మాత్రం తేనె పరిశ్రమ నడిపించవచ్చంటున్నారు నిపుణులు.. మరి ఆలస్యం ఎందుకు తేనేటీగల పెంపకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన స్కీమ్స్ ను కూడా అందుబాటులో ఉంచింది. పలు రంగాలకు సంబంధించి ఈపథకాలు అమలులో ఉన్నాయి. వీటిల్లో జాతీయ తేనెటీగల పెంపకం , తేనె మిషన్ కూడా ఒకటి. 2020లో ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రకటించింది.ఒక్క రైతులు మాత్రమే కాదు, ఆసక్తి ఉన్న ఎవరైనా ఈ మిషన్ ద్వారా సాయం అందుకుని తేనె పరిశ్రమను నడిపించవచ్చంటున్నారు అధికారులు.. అదే విధంగా తేనెటీగల పెంపకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం, తేనె, ఇతర తేనె ఉత్పత్తుల మూలాన్ని గుర్తించడం కోసం బ్లాక్చెయిన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు. పలు ప్రాంతాలలో తేనె కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తిలో అగ్రి ఎంట్రప్రెన్యూర్స్, అగ్రి-స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు, తేనెటీగల పెంపకందారుల మధ్య వాణిజ్య ఒప్పందాలను ప్రోత్సహిస్తున్నారు.. స్వయం ఉపాధి కింద ఈ పెంపకం చేపట్టడానికి ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
తేనెటీగల పెంపకం అనేది రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. తేనెటీగల పెంపకం యొక్క ప్రయోజనాలు అనేకం. పరపరాగ సంపర్కం ద్వారా పండ్లు, కూరగాయలు, నూనెగింజలు వంటి తదితర ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం పెరుగుతుంది. పర్యావరణం, వ్యవసాయం రంగంలో స్థిరమైన అభివృద్ధికి సహాయపడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇకపోతే తేనేటీగల పెంపకం చేపట్టేవాళ్ళు ముందుగా హైదరాబాద్ లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. అప్పుడే వాటి పెంపకం పై అవగాహన పెరుగుతుంది.. అలాగే ఆదాయం పెరుగుతుంది..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?