Paris Olympics 2024 : బీసీసీఐ కీలక ప్రకటన..భారతీయ అథ్లెట్లకు 8.5 కోట్ల సాయం
- జులై 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ 2024
- భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు
- టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు
- ఈ సారి అత్యధిక పథకాలు సాధించాలన్న బీసీసీఐ
- ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కి బీసీసీఐ రూ.8.5 కోట్లు
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. జులై 26న ప్రారంభోత్సవం, ఆగస్టు 11న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత అథ్లెట్ల బృందం రికార్డు బద్దలు కొట్టి పతకం సాధించేందుకు పూర్తిగా సిద్ధమైంది. అయితే అదే సమయంలో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కూడా తమ అథ్లెట్ల నుంచి పతకాలు ఆశిస్తున్నట్లు తెలిపింది. ఒలింపిక్ ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కి బీసీసీఐ రూ.8.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
READ MORE: Crime: భార్య, కొడుకుతో కలిసి 95 ఏళ్ల వృద్ధ తల్లిని మట్టుబెట్టిన కుమారుడు..
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ఈసారి పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిసిందే. ఇది కాకుండా.. క్రీడా మంత్రిత్వ శాఖ 140 మంది సహాయక సిబ్బందిని ఆమోదించింది. ఇందులో క్రీడా అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఖర్చుతో 72 మంది సహాయక సిబ్బందిని మంజూరు చేశారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు పాల్గొని 7 పతకాలు సాధించారు. వీటిలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన చరిత్రాత్మక స్వర్ణ పతకం కూడా ఉంది. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఆటగాళ్లలో షాట్పుట్ అథ్లెట్ అభా ఖతువా పేరు జాబితాలో లేదు.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!