Paris Olympics 2024 : బీసీసీఐ కీలక ప్రకటన..భారతీయ అథ్లెట్లకు 8.5 కోట్ల సాయం
- జులై 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ 2024
- భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు
- టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు
- ఈ సారి అత్యధిక పథకాలు సాధించాలన్న బీసీసీఐ
- ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కి బీసీసీఐ రూ.8.5 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ టోర్నీపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. జులై 26న ప్రారంభోత్సవం, ఆగస్టు 11న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత అథ్లెట్ల బృందం రికార్డు బద్దలు కొట్టి పతకం సాధించేందుకు పూర్తిగా సిద్ధమైంది. అయితే అదే సమయంలో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కూడా తమ అథ్లెట్ల నుంచి పతకాలు ఆశిస్తున్నట్లు తెలిపింది. ఒలింపిక్ ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కి బీసీసీఐ రూ.8.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
READ MORE: Crime: భార్య, కొడుకుతో కలిసి 95 ఏళ్ల వృద్ధ తల్లిని మట్టుబెట్టిన కుమారుడు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈసారి పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిసిందే. ఇది కాకుండా.. క్రీడా మంత్రిత్వ శాఖ 140 మంది సహాయక సిబ్బందిని ఆమోదించింది. ఇందులో క్రీడా అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఖర్చుతో 72 మంది సహాయక సిబ్బందిని మంజూరు చేశారు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. గత టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు పాల్గొని 7 పతకాలు సాధించారు. వీటిలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన చరిత్రాత్మక స్వర్ణ పతకం కూడా ఉంది. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ఆటగాళ్లలో షాట్పుట్ అథ్లెట్ అభా ఖతువా పేరు జాబితాలో లేదు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!