BC Janardhan Reddy: బీసీ జనార్థన్ రెడ్డి దాతృత్వం.. దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల పంపిణీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Janardhan Reddy: నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడి రూటే సెపరేట్.. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అంతే.. సొంతంగా ఎంత ఖర్చైనా పర్లేదు.. ప్రజల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరాల్సిందే అని పంతం పడతారు.. విశ్వసనీయత, మాట తప్పడం, మడమ తిప్పడం అంటూ కబుర్లు చెప్పడం కాదు.. నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రజల విశ్వాసం చూరగొనడంలో ఆయనకు ఆయనే సాటి.. తన సేవాగుణంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
Read Also: Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
ఓట్ల కోసం ప్రజలకు వల్లమాలిన హామీలు ఇస్తూ.. తీరా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ప్రజలను గాలికి వదిలేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు ఉన్న ఈ కాలంలో రాజకీయాలకు అతీతంగా, పదవుల్లో ఉన్నా లేకున్నా.. ప్రతి నిత్యం తన నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ.. సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం.. అభ్యాగ్యులకు అండగా నిలబడుతున్న నిస్వార్థ ప్రజాసేవకుడిగా బనగానపల్లె ప్రజల గుండెల్లో టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. తాజాగా బనగానపల్లె నియోజకవర్గంలో దివ్యాంగులకు భరోసాగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
Read Also: Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
గత కొన్నాళ్లుగా బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా గ్రామగ్రామానా విస్తృతంగా పర్యటించిన బీసీ జనార్థన్ రెడ్డి పలువురు దివ్యాంగులు ట్రై సైకిళ్లు లేక పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వారికి తన సొంత డబ్బులతో ట్రై సైకిల్ కొని ఇస్తానని, జీవనోపాధికి తగిన సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ (మార్చి 7) బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సొంత డబ్బులతో ట్రై సైకిళ్లు కొనుగోలు చేసి 12 మంది దివ్యాంగులకు ఉచితంగా అందించి మరోసారి తన పెద్దమనసును చాటుకున్నారు. వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. మాట తప్పి, మడమ తిప్పే నాయకులను చూస్తున్న ఈ కాలంలో మాట ఇచ్చి, నెరవేర్చిన నిఖార్సైన నాయకుడిగా బనగానపల్లె ప్రజల గుండెల్లో చెరగని సంతకంలా.. తనదైన ముద్ర వేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!