Bank Deposit Insurance Scheme : బ్యాంకు దివాళా తీసినా.. మీకు రూ.5లక్షలు వస్తాయి ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Deposit Insurance Scheme : గత కొన్నేళ్లుగా.. ఆర్థిక అవకతవకల కారణంగా దేశంలోని చాలా బ్యాంకుల పరిస్థితి దిగజారింది. డబ్బు లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ నిషేధించే స్థాయికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల ఖాతాదారులే ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనల వల్ల బ్యాంకు దివాళా తీస్తే తమ సొమ్ము ఏమైపోతుందనే ప్రశ్న చాలా మంది ఖాతాదారుల్లో మెదలుతోంది. మీకు ఖాతా ఉన్న ఏదైనా బ్యాంకు మునిగిపోతే, మీకు రూ. 5 లక్షల మొత్తం లభిస్తుంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం, మీరు బ్యాంకు ఖాతాలో 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసి ఉండాలి. ఈ సందర్భంలో మాత్రమే మీకు 5 లక్షల రూపాయలు లభిస్తాయి.
5 లక్షల వరకు ప్రభుత్వం హామీ ఇస్తుంది
డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం ప్రకారం, బ్యాంకులో డిపాజిట్ మొత్తం ఐదు లక్షల రూపాయలకు హామీ ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఈ మొత్తం రూ. 1 లక్ష ఉండగా, 2020 సంవత్సరంలో, ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. అంటే, మీ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు దివాళా తీస్తే.. ఖాతాలో జమ చేసిన మొత్తం ఐదు లక్షల కంటే ఎక్కువ అయినప్పటికీ, మీకు ఐదు లక్షల రూపాయల మొత్తం తిరిగి వస్తుంది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అయితే, ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన ఏ బ్యాంకును ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకోదు. ఇందుకోసం మునిగిపోతున్న బ్యాంకును మరో పెద్ద బ్యాంకులోకి విలీనం చేస్తారు. అప్పటికీ నష్టాలు భరించలేక బ్యాంకు కుప్పకూలినట్లయితే, ఖాతాదారులందరికీ చెల్లించాల్సిన బాధ్యత DICGCపై ఉంటుంది. DICGC ఈ మొత్తానికి హామీ ఇచ్చినందుకు బదులుగా బ్యాంకుల నుండి ప్రీమియం తీసుకుంటుంది.
ఏమిటా చట్టం.. ఎక్కడ దరఖాస్తు చేయాలి?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు దివాళా తీస్తే, ఏఐడీలో చేరిన 45 రోజులలోపు ఖాతాదారులందరికీ డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. దీని తర్వాత, DICGC 90 రోజుల్లోపు వినియోగదారులకు డబ్బును తిరిగి ఇవ్వాలి. ఆగస్టు 2022కి సంబంధించిన కొత్త అప్డేట్లో, దేశంలోని మొత్తం 2,035 బ్యాంకులకు బీమా చేసినట్లు DICGC తెలిపింది. ఇది కాకుండా, మీ బ్యాంక్ బీమా చేయబడిందో లేదో తెలుసుకోవాలనుకుంటే, మీరు https://www.dicgc.org.in/FD_ListOfInsuredBanks.htmlని సందర్శించడం ద్వారా దాని సమాచారాన్ని పొందవచ్చు.
గత 15 నెలల్లో దేశంలోని 35 బ్యాంకులకు చెందిన 3 లక్షల మంది కస్టమర్లు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీని కింద ప్రభుత్వం సుమారు 4 వేల కోట్ల రూపాయలను ప్రజలకు తిరిగి ఇచ్చింది. దేశంలోని 35 బ్యాంకులకు చెందిన 3,06,146 మంది ఖాతాదారులు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టం కింద డబ్బును క్లెయిమ్ చేశారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్ గతేడాది డిసెంబర్లో లోక్సభకు తెలిపారు. ఈ మొత్తం సెప్టెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 2022 వరకు తిరిగి ఇవ్వబడింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!