Bangladesh News : బంగ్లాదేశ్లో జైలు పై దాడి.. 500 మందికి పైగా ఖైదీలు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh News : ప్రస్తుతం పొరుగుదేశం బంగ్లాదేశ్లో గందరగోళం నెలకొని ఉంది. రెండు నెలలుగా విద్యార్థులు రిజర్వేషన్ల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆ తర్వాత సోమవారం (ఆగస్టు 5) బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనల కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్లుగా ఆమె ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, విద్యార్థులు సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు.
Read Also:CM Revanth Reddy: ఆయన పాట ప్రజా యుద్ధ నౌక.. గద్దర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..
Also Read
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తరువాత, దేశ పరిస్థితి, వ్యవస్థ పతనమైంది. ఆ తర్వాత దేశంలోని జైళ్లు కూడా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి దేశంలో కర్ఫ్యూ విధించింది. అయితే సోమవారం ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో అగంతకులు పగటిపూట కర్రలతో జైలులోకి ప్రవేశించారు. ఉత్తర బంగ్లాదేశ్లోని షేర్పూర్ జిల్లాలోని జైలు నుంచి దాదాపు 500 మంది ఖైదీలు దుండగుల సాయంతో పరారయ్యారు.
Read Also:INDIA Alliance: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన.. ఎందుకో తెలుసా..?
పోలీస్ స్టేషన్కు నిప్పు
షేర్పూర్ మాత్రమే కాదు, దామ్దామా కాలిగంజ్ ప్రాంతంలోని జైలులోకి కూడా ప్రజలు ప్రవేశించి జైలుకు నిప్పు పెట్టారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జైలుపై దాడి జరిగిందని షేర్పూర్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్లా అల్ ఖైరున్ తెలిపారు. అలాంటి విధ్వంసకర దృశ్యం సోమవారం బంగ్లాదేశ్లో కనిపించింది. ఆగ్రహించిన గుంపు జైలునే కాకుండా పోలీసు స్టేషన్ను కూడా లక్ష్యంగా చేసుకుంది. సుమారు 1 గంట సమయంలో సదర్ పోలీస్ స్టేషన్కు ప్రజలు నిప్పు పెట్టారు. ఆ గుంపు జిల్లా పరిషత్, జిల్లా ఎన్నికల కార్యాలయం, సోనాలి బ్యాంక్, అనేక దుకాణాలను కూడా ధ్వంసం చేసింది. షేక్ హసీనా, భారతదేశం మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆమె బంగ్లాదేశ్ నుండి పొరుగు దేశం భారతదేశానికి నేరుగా బయలుదేరింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్లవచ్చని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు.
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!