One Year of Yunus Rule: బంగ్లాదేశ్లో ఏడాది పాలన.. ఇదే అసలు ట్విస్ట్ !
One Year of Yunus Rule: బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. గడిచిన ఈ ఏడాది కాలంలో ఆ దేశం అనుసరించిన విదేశాంగ విధానంలో అనేక మార్పులు స్పష్టంగా కనిపించాయని దౌత్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూనస్ చేతికి ఎప్పుడైతే పాలనా పగ్గాలు వెళ్లాయో నాటి నుంచి బంగ్లాదేశ్- ఇండియా సంబంధాలు క్షీణించాయి. ఈ సమయంలోనే బంగ్లాకు చైనా, పాకిస్తాన్లతో మైత్రి పెరిగింది. అలాగే జపాన్, యూరోపియన్ యూనియన్తో సంబంధాలు కూడా బలోపేతం చేసుకుంది. 2026 ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రకటన వెలువడింది. ఈనేపథ్యంలో బంగ్లాదేశ్- భారత్తో ఏర్పడిన దూరాన్ని తగ్గించుకోగలదా..
READ MORE: Pune: పూణెలో కూలిన శిక్షణా విమానం.. పైలట్ సురక్షితం
Also Read
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
అతిపెద్ద వాణిజ్య భాగస్వామి నుంచి…
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్న 15 ఏళ్లు ఆ దేశ విదేశాంగ విధానం ఇండియా చుట్టూనే తిరిగింది. ఈ కాలంలో భారతదేశం బంగ్లాదేశ్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారడమే కాకుండా, ఈ రెండు దేశాలు శత్రువులుగా పరిగణించబడే చైనా, పాకిస్థాన్లతో పరిమిత సంబంధాలను కొనసాగించింది. ఎప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయి.. యూనస్ వచ్చాడో నాటి నుంచి ఆ దేశ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఆయన అనేక భారత వ్యతిరేక విధానాలను అవలంబించాడు. ఇండియాతో సంబంధాలు క్షీణించిన కారణంగా బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం వచ్చే రోగులు, విద్యార్థులు, ఇతర పర్యాటకుల సంఖ్య అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఫలితంగా ఇప్పుడు వాళ్లు బ్యాంకాక్, సింగపూర్ లేదా ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగ్లాదేశ్కు రాజకీయంగా ముఖ్యమైన దేశాలు భారతదేశం, చైనా, జపాన్, బ్రస్సెల్స్ (యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం), యూఎస్. ఈ ఏడాది కాలంలో చైనా, పాకిస్థాన్.. బంగ్లాదేశ్కు చాలా దగ్గర అయ్యాయి. భారతదేశంతో క్షీణిస్తున్న సంబంధాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి బీజింగ్, ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను బలోపేతం చేయడానికి చైనా ప్రభుత్వం ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ను చైనాకు ఆహ్వానించింది. యూనస్ బీజింగ్లో చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించారు. చైనా కేవలం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో మాత్రమే కాకుండా, ఆ దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి బీజింగ్ ఆసక్తి చూపినప్పటికీ, ఇప్పటివరకు అది చర్చలకే పరిమితం అయింది. మరోవైపు పాకిస్థాన్ మరోసారి బంగ్లాదేశ్కు మతపరంగా, చారిత్రకంగా తాము ఒకటని చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఏడాది కాలంలో ఈ రెండు దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు రెండు దేశాలను సందర్శించారు. దీనితో పాటు రెండు దేశాలు వాణిజ్యంతో పాటు సైనిక సహకారాన్ని పెంచుకోవడం ప్రారంభించాయి. ప్రధాన దేశాలతో బంగ్లాదేశ్ సంబంధాలను పెంచడంలో తాత్కాలిక ప్రభుత్వం విజయవంతమైంది. గత ఏడాది బంగ్లాదేశ్ విదేశీ సంబంధాలలో సాధించిన పురోగతికి ప్రధాన కారణంగా దాని ప్రపంచ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ వ్యక్తిగత సంబంధాలు, ఆయనకు ఉన్న సానుకూల ఇమేజ్ అని దౌత్య నిపుణులు పేర్కొంటున్నారు. 2007-08లో కూడా బంగ్లాదేశ్లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, కానీ ఈ కాలంలో ద్వైపాక్షిక పర్యటనలు జరగలేదు. ఇప్పుడు మహ్మద్ యూనస్ అనేక దేశాలను సందర్శించారు. అలాగే అనేక దేశాల నాయకులు బంగ్లాదేశ్ను సందర్శించారు.
అమెరికాకు లాభం జరిగినా..
బంగ్లాదేశ్లో హసీనాపై తిరుగుబాటుకు, యూనస్ సింహాసనాన్ని అధిష్టించడానికి వెనుక అమెరికా హస్తం ఉందని అనేక వాదనలు ఉన్నాయి. షేక్ హసీనా పరిపాలనా కాలంలో అమెరికా సైనిక స్థావరాన్ని డిమాండ్ చేసిందని, హసీనా దానిని తిరస్కరించిన కారణంగా అధికారం కోల్పోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. గత ఏడాది బంగ్లా తాత్కాలిక సారథి యూనస్ న్యూయార్క్ పర్యటన సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను కలిశారు. అప్పుడు రెండు దేశాల మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ స్నేహం తగ్గింది. ఇక్కడో విశేషం ఏమిటంటే ట్రంప్ గత ఏప్రిల్లో బంగ్లాదేశ్పై అదనపు సుంకాలను కూడా విధించారు. అయితే ఇరుపక్షాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ బ్రస్సెల్స్లోని EU ప్రధాన కార్యాలయం, EUతో నిరంతరం చర్చలు జరుపుతోంది. బంగ్లాదేశ్లో రాబోయే జాతీయ ఎన్నికలకు పరిశీలకులను పంపడంలో EU ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే బంగ్లాదేశ్ EUతో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను కల్పించేందుకు రూపకల్పన చేసిన భాగస్వామ్య, సహకార ఒప్పందం (PCA)పై చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు 2025 లోగా పూర్తవుతాయని అంచనా. జపాన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు యూనస్ టోక్యోను సందర్శించారు. ఆయన ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్కు ఇచ్చిన వాగ్దానాలను కొనసాగించడానికి జపాన్ ఆసక్తిని వ్యక్తం చేసింది. అయితే జపాన్- బంగ్లాదేశ్తో ఏ కొత్త ప్రధాన ఒప్పందాలలో చేరాలనే కోరికను ప్రదర్శించలేదు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారతదేశం నుంచి దూరంగా ఉండటం ద్వారా ప్రత్యామ్నాయాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది. కానీ భారతదేశం లేకుండా బంగ్లాదేశ్ను పురోగతి వైపు తీసుకెళ్లడం యూనస్ ప్రభుత్వానికి అంత సులభం కాదు. అయితే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఎన్నికవుతుంది. ఈ ఎన్నికపై భారతదేశంతో పాటు ప్రపంచం నిఘా కూడా ఉంచుతోంది.
READ MORE: Tollywood : మరోసారి భేటీ కానున్న నిర్మాతలు, ఫెడరేషన్
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?